భారత వలసదారుడైన కళాకారుడి మృతి

- November 20, 2019 , by Maagulf
భారత వలసదారుడైన కళాకారుడి మృతి

బహ్రెయిన్‌: భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోగల కోజికోడ్‌ జిల్లాకి చెందిన 49 ఏళ్ళ బిజు కుటోత్‌, బహ్రెయిన్‌ కింగ్‌డమ్‌లో ప్రాణాలు కోల్పోయారు. హిద్‌లోని తాను పనిచేస్తున్న ప్రాంతంలో ఆయన మృత్యువాతపడ్డారు. ఫైబర్‌ గ్లాస్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని కాయిన్‌పై చిత్రీకరించారాయన. ఇటీవల బహ్రెయిన్‌కి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ఆ కాయిన్‌ని బహూకరించారు కూడా. హవాలి రౌండెబౌట్‌పై ఏర్పాటు చేసిన నేషనల్‌ ఎంబ్లమ్‌ స్ట్రక్చర్‌ని ఆయనే డిజైన్‌ చేశారు. సామాజిక కార్యక్రమాల్లోనూ కుటోత్‌ ఎంతో చురుగ్గా వుండేవారని ఎక్స్‌పాట్రియేట్‌ కమ్యూనిటీ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com