ఢిల్లీ వెళ్లే విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా ఆఫర్
- November 20, 2019న్యూఢిల్లీ : ఢిల్లీ వెళ్లే విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా శుభవార్త వెల్లడించింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కాలుష్యం కమ్ముకున్న నేపథ్యంలో ఎయిర్ ఏసియా ఢిల్లీకి ప్రయాణిస్తున్న తన విమాన ప్రయాణికులకు యాంటీ పొల్యూషన్ మాస్క్లను పంపిణీ చేస్తోంది. హైదరాబాద్ నగరంతోపాటు ముంబై, బెంగళూరు, కోల్కతా నగరాల నుంచి ఢిల్లీకి వస్తున్న ప్రయాణికులు కాలుష్యం బారిన పడకుండా ఎయిర్ ఏసియా యాంటీ పొల్యూషన్ మాస్క్ లను పంపిణీ చేస్తోంది. హెల్త్ టెక్నాలజీ స్టార్ట్ అప్ ఎంఫిన్ సంస్థ భాగస్వామ్యంతో విమాన ప్రయాణికులకు యాంటీ పొల్యూషన్ మాస్క్ లను అందిస్తోంది. ఢిల్లీలో వెలువడుతున్న కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినకుండా ముందుజాగ్రత్తగా యాంటీ పొల్యూషన్ మాస్క్లను ఈ నెల 19 నుంచి 29వతేదీ వరకు అందించాలని నిర్ణయించామని ఎయిర్ ఏసియా అధికార ప్రతినిధి వెల్లడించారు. విమాన ప్రయాణికులు కలుషిత వాయువులు పీల్చి అనారోగ్యం బారిన పడకుండా ఈ మాస్క్ లు ఎంతగానో ఉపయోగపడతాయని ఎయిర్ ఏసియా తెలిపింది.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ