ఇండియా, పాకిస్తాన్‌ బాక్సర్ల శాంతి సందేశం

- November 23, 2019 , by Maagulf
ఇండియా, పాకిస్తాన్‌ బాక్సర్ల శాంతి సందేశం

యూఏఈ: భారత బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌, పాకిస్తానీ బాక్సర్‌ ముహమమ్మద్‌ వసీమ్‌, దుబాయ్‌లో మాట్లాడుతూ శాంతి సందేశం పంపించారు. 'ఇరు దేశాల గురించీ గొప్పగా రాయండి. మేం శాంతిని కోరుకుంటున్నాం.. ఇరు దేశాల్లోనూ మీడియా సంయమనం పాటించాలి.. శాంతి సందేశాల గురించి చెప్పాలి.. ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు నెలకొనడంలో తమవంతు పాత్ర పోషించాలి..' అని ఇరువురు బాక్సర్లూ ఆకాంక్షించారు. వసీమ్‌ ఈ సందర్భంగా భారత బాక్సర్‌ విజేందర్‌ని ఆప్యాయంగా కౌగలించుకున్నారు. ట్రెయినింగ్‌ కోసం మాంచెస్టర్‌ వెళ్ళినప్పుడు తామిద్దరం స్నేహితులమనీ, ఆ స్నేహం అలాగే కొనసాగుతుందని వసీమ్‌ పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com