దుబాయ్: బిజినెస్ మీట్ కి ముఖ్యఅతిధిగా విచ్చేసిన టి.జి.వెంకటేష్
- November 23, 2019దుబాయ్:దుబాయ్ లో గణేష్ రాయపూడి(ఇండెక్స్ LLC,దుబాయ్ మ్యానేజింగ్ డైరెక్టర్) ఆధ్వర్యంలో బిజినెస్ మీట్ కి ముఖ్యఅతిధిగా టి.జి వెంకటేష్(రాజ్యసభ ఎం.పి మరియు జాతీయ రవాణా, పర్యాటక, సాంస్కృతిక విభాగాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్) విచ్చేసారు.టి.జి వెంకటేష్ వ్యాపారవేత్త మరియు రాజకీయవేత్త. 1999 నుండి 2004 వరకు మరియు 2009 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాసనసభ (ఎమ్మెల్యే) సభ్యుడిగా పనిచేశారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో మైనర్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. 2016 నుండి రాజ్యసభ సభ్యుడు గా కొనసాగుతున్నారు.
ఈ కార్యక్రమం లో యూ.ఏ.ఈ లోని పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి.జి వెంకటేష్ మాట్లాడుతూ భారత దేశంలో వ్యాపారాలకు ఉన్న అవకాశాలు పై వివరించారు.
ప్రముఖ సోషల్ వర్కర్గా ..40 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించిన ఉమా పద్మనాభన్ (ఉమా ప్యాడీ) ను సత్కరించారు.గణేష్ రాయపూడి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం తదనంతరం విందు ఏర్పాటు చేసారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ