సిరియాలో కారు బాంబు పేలుడు..షుమారు పది మంది మృతి, 20 మందికి పైగా గాయాలు
- November 24, 2019అంకారా : ఈశాన్య సిరియాలో శనివారం జరిగిన కారు బాంబు పేలుడులో షుమారు పది మంది మృతి చెందినట్టు టర్కీ రక్షణ శాఖ తెలిపింది. ఈ దుర్ఘటనలో 20మందికి పైగా గాయాలయ్యాయి. టెల్అబియాడ్లోని పారిశ్రామిక వాడలో కారుబాంబు పేలుడు సంభవించింది. సిరియాలోని కుర్దీష్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని మంత్రిత్వ శాఖ ఆరోపించింది. టెల్ అబియాడ్లో ఈ నెలలోనే అంతకుముందు రెండు కారు బాంబు పేలుళ్ళు జరిగి 21 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈశాన్య సిరియాలోని పలు ప్రాంతాలకు టర్కీ విస్తరిస్తూ కుర్దీష్ బలగాలను తన సరిహద్దుల నుండి దూరంగా నెట్టివేస్తోంది. కుర్దీషులను ఉగ్రవాదులుగా టర్కీ భావిస్తుంది. ఇదే కుర్దీష్లు సిరియాలో ఐఎస్ఐతో అమెరికాతో కలిసి పోరాడారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్