అమెరికా విలేఖరికి 18 కోట్ల డాలర్ల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ
- November 24, 2019ఇరాన్ చెరలో 544 రోజులపాటు నిర్బంధాన్ని, చిత్రహింసలను ఎదుర్కొన్న ఒక అమెరికా విలేఖరికి 18 కోట్ల డాలర్ల (రూ.1292 కోట్లు) నష్టపరిహారం ఇవ్వాలని అమెరికా కోర్టు ఆదేశించింది. వాషింగ్టన్పోస్ట్ పత్రిక విలేఖరిగా ఇరాన్లో విధులు నిర్వహించిన జాసన్ రెజాయిన్ అనే విలేఖరిని.. గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఇరాన్ ప్రభుత్వం 2014లో అరెస్టు చేసింది. అతడి భార్యను కూడా నిర్బంధించి ఆ తర్వాత విడుదల చేసింది. జాసన్ను మాత్రం 544 రోజులపాటు టెహ్రాన్లోని ఒక జైలులో నిర్బంధించి.. ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి మేరకు విడుదల చేసింది. అమెరికాకు చేరుకున్న జాసన్.. తనకు ఇరాన్ నుంచి పరిహారం ఇప్పించాలంటూ కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన ఫెడరల్ జడ్జి.. జాసన్కు 18 కోట్ల డాలర్ల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఇరాన్ స్పందించలేదు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు