షికాగోలో భారత విద్యార్థి దారుణ హత్య

- November 26, 2019 , by Maagulf
షికాగోలో భారత విద్యార్థి దారుణ హత్య

వాషింగ్టన్: అమెరికాలోని షికాగోలో భారత విద్యార్థి దారుణ హత్యకు గురైంది. ఆమపై లైంగిక దాడి చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికాలో ఈ సంఘటన తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యకు గురైన విద్యార్థిని హైదరాబాదుకు చెందిన 19 ఏళ్ల రూత్ జార్జ్ గా గుర్తించారు.

ఇలినియోస్ విశ్వవిద్యాలయంలో రూత్ జార్జ్ చదువుతోంంది. క్యాంపస్ గ్యారేజీ యజమాని కుటుంబానికి చెందిన వాహనంలోని వెనక సీట్లో ఆమె శనివారంనాడు శవమై కనిపించింది. దాడి చేసిన డోనాల్డ్ తుర్మాన్ (26)ను పోలీసులు ఆదివారం షికాగో మెట్రో స్టేషన్ లో అరెస్టు చేశారు సోమవారంనాడు నిందితుడిపై కోర్టులో అభియోగాలు మోపారు.

శుక్రవారం నుంచి రూత్ జార్జ్ కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు శనివారంనాడు విశ్వవిద్యాలయం పోలీసులకు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com