బంగ్లా కేఫ్ నరమేధం కేసులో... దోషులకు ఉరిశిక్ష
- November 28, 2019ఢాకా:బంగ్లాదేశ్లో 2016లో ఓ కేఫ్లో చొరబడిన మిలిటెంట్లు నరమేధం సృష్టించారు. ఈ కేసులో దోషులుగా తేలిన జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) మిలిటెంట్ గ్రూపుకు చెందిన ఏడుగురు సభ్యులకు ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఉరిశిక్ష విధించింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో జేఎంబీ సభ్యుడిని నిర్దోషిగా తేల్చింది. ' మారణహౌమం సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఇలాంటి వారికి ఉరే సరైన శిక్ష' అని తీర్పు వెలువరించే సమయంలో జస్టిస్ ముజీబుర్ రహ్మాన్ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుపై బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో యాంటీ టెర్రరిస్ట్ ట్రిబ్యునల్ ఎదురుగా భారీగా బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రాపిడ్ యాక్షన్ బెటాలియన్, భద్రతా బలగాలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జేఎంబీ సానుభూతిపరులు కోర్టు ఆవరణకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు తీర్పును విమర్శించారు. ప్రత్యేక న్యాయస్థానం తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్టు దోషుల కుటుంబ సభ్యులు మీడియాతో చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గులామ్ షరూర్ ఖాన్ జాకిర్ వెల్లడించిన వివరాల ప్రకారం...2016, జులై1న ఢాకాలోని గుల్షన్ ప్రాంతంలోని హౌలీ ఆర్టీసన్ కేఫ్పై జేఎంబీ మిలిటెంట్ గ్రూపు సభ్యులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 22మంది మృతి చెందారు. వీరిలో 17 మంది విదేశీయులు ఉన్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్