ఉద్ధవ్ ఠాక్రే వెనుక ఉన్నది ఎవరు?
- November 28, 2019
శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రకు దేవేంద్ర ఫడ్నవీస్ తర్వాత ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఠాకరే వంశంలోనే తొలి సీఎం కానున్న ఉద్ధవ్ ఠాకరే విజయానికి మూలం అతని భార్య రష్మీ ఠాకరే. అంతేకాదు కొడుకు ఆదిత్య ఠాకరే 19ఏళ్లకే రాజకీయ అరంగ్రేటం చేయడానికి కూడా ఆమే కారణం. ఇది చాలా మందికి తెలియని విషయం.
చాలా ఏళ్లుగా బీజేపీతో శివసేన ఒప్పందం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఆమెదే. శివసేన మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉంటూ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
క్లాస్మేట్గా ఉద్ధవ్-రష్మీ ఠాకరేల పరిచయం:
ముంబైలోని జేజే ఆర్ట్ స్కూల్లో చదువుతుండగా రష్మీ, ఉద్ధవ్ ఠాకరేల పరిచయమైంది. ఆ తర్వాత వారి మధ్య ప్రేమ చిగురించడంతో పెళ్లి చేసుకుని కొన్నాళ్లు ఇంటికి దూరంగా ఉన్న రెండేళ్ల తర్వాత అందరితో కలిశారు. స్వతహాగా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఉద్దవ్ ఠాకరే ఆ సమయంలో యాడ్ ఏజెన్సీలో పనిచేశారు. ఆ తర్వాత భార్య రష్మీ ఠాకరే చొరవతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
భర్త రాజకీయాల్లోకి వెళ్లడానికే కాకుండా కొడుకును 19ఏళ్లకే రాజకీయ అరంగ్రేటం చేసేలా ప్రోత్సహించారు. కేవలం రాజకీయాల్లోనే కాకుండా వ్యాపారంలోనూ అడుగుపెట్టిన రష్మీ ఠాకరే.. సామ్వేద్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, సహయోగ్ డీలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలకు డైరక్టర్ గా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!