రేపటినుంచి విధుల్లో చేరండి: సీఎం కేసీఆర్
- November 28, 2019
తెలంగాణలో ఆర్టీసీ సమస్యకు ముగింపు తేవాలని కేబినెట్ భేటీలో నిర్ణయించామని సీఎం కేసీఆర్ అన్నారు. కార్మికులందరూ రేపు విధుల్లో చేరండని కేసీఆర్ తీపికబురు అందించారు. దీంతో దాదాపు రెండు నెలలు కొనసాగిస్తున్న కార్మికుల సమ్మెకు చరమ గీతం పాడినట్లైంది. ఈ రోజు కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినేట్ సమావేశం జరిగింది. భేటీ అనంతరం మీడియాతో సమావేశమై వివరాలను వెల్లడించారు. విపక్షాలు కార్మికులకు లేని ఆశలు కల్పించారని విమర్శించారు. ఆర్టీసీ విషయంలో లేబర్ కోర్టు మాకు ఇంకా సమయం ఇచ్చిందన్నారు. రాజకీయ నిరుద్యో్గుల ఆర్టీసీ సమ్మె విషయంలో హంగామా సృష్టించారు. కార్మికులు యూనియన్ల మాటలు నమ్మాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రజల పొట్టలు నింపామే తప్ప ఎవరి పొట్టా కొట్టలేదని కేసీఆర్ అన్నారు. దీంతో దాదాపు రెండు నెలలు కొనసాగిస్తున్న కార్మికుల సమ్మెకు చరమ గీతం పాడినట్లైంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







