రేపటినుంచి విధుల్లో చేరండి: సీఎం కేసీఆర్

- November 28, 2019 , by Maagulf
రేపటినుంచి విధుల్లో చేరండి: సీఎం కేసీఆర్

తెలంగాణలో ఆర్టీసీ సమస్యకు ముగింపు తేవాలని కేబినెట్ భేటీలో నిర్ణయించామని సీఎం కేసీఆర్ అన్నారు. కార్మికులందరూ రేపు విధుల్లో చేరండని కేసీఆర్ తీపికబురు అందించారు. దీంతో దాదాపు రెండు నెలలు కొనసాగిస్తున్న కార్మికుల సమ్మెకు చరమ గీతం పాడినట్లైంది. ఈ రోజు కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినేట్ సమావేశం జరిగింది. భేటీ అనంతరం మీడియాతో సమావేశమై వివరాలను వెల్లడించారు. విపక్షాలు కార్మికులకు లేని ఆశలు కల్పించారని విమర్శించారు. ఆర్టీసీ విషయంలో లేబర్ కోర్టు మాకు ఇంకా సమయం ఇచ్చిందన్నారు. రాజకీయ నిరుద్యో్గుల ఆర్టీసీ సమ్మె విషయంలో హంగామా సృష్టించారు. కార్మికులు యూనియన్ల మాటలు నమ్మాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రజల పొట్టలు నింపామే తప్ప ఎవరి పొట్టా కొట్టలేదని కేసీఆర్ అన్నారు. దీంతో దాదాపు రెండు నెలలు కొనసాగిస్తున్న కార్మికుల సమ్మెకు చరమ గీతం పాడినట్లైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com