టర్కీలో మరోసారి బాంబు దాడి
- January 13, 2016
: రెండు రోజుల వ్యవధిలోనే టర్కీలో మరోసారి బాంబు దాడి జరగడం స్థానికంగా కలకలం రేపింది. కుర్దిష్ తిరుగుబాటుదారులు జరిపిన కారు బాంబు దాడిలో అయిదుగురు మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం నార్త్-ఈస్ట్ టర్కీలో చోటుచేసుకుంది. మంగళవారం ఇక్కడ జరిగిన ఆత్మాహుతి దాడిలో 10 మంది జర్మన్ పర్యాటకులు మరణించిన విషయం విదితమే. డియాబకిర్ సమీపంలోని సినార్ పట్టణంలోని ఓ పోలీస్ స్టేషన్ లక్ష్యంగా కుర్దిష్ వర్కర్స్ పార్టీ(పీకేకే) రెబల్స్ కారుబాంబుతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు, వారి కుటుంబసభ్యులు ఈ ఘటనలో గాయపడ్డారు. కారు బాంబు జరిపిన అనంతరం రాకెట్ బాంబులతో దూరపు లక్ష్యాలను టార్గెట్ చేసుకుని దాడి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.పోలీస్ స్టేషన్ సహా దానిని అనుకుని ఉన్న ఓ ఇళ్లు ధ్వంసమైంది. పీకేకే 1984లో తిరుగుబాటు ప్రారంభించింది, కానీ అనంతరం తమ ఉనికిని మరింత విస్తృతం చేసేదిశగా ఈ దాడులకు పాల్పడుతోందని అధికారి చెప్పారు. అప్పట్లో జరిగిన దుర్ఘటనలో వేల మంది చనిపోయారు. డజన్ల కొద్ది సామాన్యులు రెబల్స్ దాడుల్లో మృతిచెందుతుండటం, మంగళవారం ఆత్మాహుతి దాడి జరిగిన కారణంగా మిలిటరీ ఇటీవలే మూడు నగరాలలో తనిఖీలు చేపట్టిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







