విష్ణువర్ధన్ దర్శకత్వంలో రామ్ చరణ్..
- January 13, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "పంజా" చిత్రాన్ని తెరకెక్కించిన తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తాజాగా మరో మెగా హీరోను లైన్ లో పెట్టారా? అంటే ఫిలింనగర్ వర్గాలు అవుననే అంటున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'తనిఒరువన్' రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇటీవల తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ చెర్రీని కలిసి ఓ కధ వినిపించినట్లుగా, దానికి చెర్రీ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. నిజానికి "మగధీర" చిత్రం తర్వాతే వీరిద్దరి కాంభినేషన్ సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంది.హీరోలను స్టైలిష్ గా చూపించడంలో విష్ణుది అందెవేసిన చేయి. మరి చెర్రీని ఏ విధంగా చూపిస్తారో?!
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







