టర్కీలో మరోసారి బాంబు దాడి

- January 13, 2016 , by Maagulf
టర్కీలో మరోసారి బాంబు దాడి

: రెండు రోజుల వ్యవధిలోనే టర్కీలో మరోసారి బాంబు దాడి జరగడం స్థానికంగా కలకలం రేపింది. కుర్దిష్ తిరుగుబాటుదారులు జరిపిన కారు బాంబు దాడిలో అయిదుగురు మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం నార్త్-ఈస్ట్ టర్కీలో చోటుచేసుకుంది. మంగళవారం ఇక్కడ జరిగిన ఆత్మాహుతి దాడిలో 10 మంది జర్మన్ పర్యాటకులు మరణించిన విషయం విదితమే. డియాబకిర్ సమీపంలోని సినార్ పట్టణంలోని ఓ పోలీస్ స్టేషన్ లక్ష్యంగా కుర్దిష్ వర్కర్స్ పార్టీ(పీకేకే) రెబల్స్ కారుబాంబుతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు, వారి కుటుంబసభ్యులు ఈ ఘటనలో గాయపడ్డారు. కారు బాంబు జరిపిన అనంతరం రాకెట్ బాంబులతో దూరపు లక్ష్యాలను టార్గెట్ చేసుకుని దాడి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.పోలీస్ స్టేషన్ సహా దానిని అనుకుని ఉన్న ఓ ఇళ్లు ధ్వంసమైంది. పీకేకే 1984లో తిరుగుబాటు ప్రారంభించింది, కానీ అనంతరం తమ ఉనికిని మరింత విస్తృతం చేసేదిశగా ఈ దాడులకు పాల్పడుతోందని అధికారి చెప్పారు. అప్పట్లో జరిగిన దుర్ఘటనలో వేల మంది చనిపోయారు. డజన్ల కొద్ది సామాన్యులు రెబల్స్ దాడుల్లో మృతిచెందుతుండటం, మంగళవారం ఆత్మాహుతి దాడి జరిగిన కారణంగా మిలిటరీ ఇటీవలే మూడు నగరాలలో తనిఖీలు చేపట్టిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com