ఉచితంగా గల్ఫ్ మృతదేహాలు తరలింపునకు కొత్త పథకం:కేరళ ప్రభుత్వం
- November 30, 2019
కేరళ:తమ రాష్ట్రం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన ప్రవాసీయులకు కేరళ ప్రభుత్వం ఊరటనిచ్చింది. అనారోగ్యంతో మృతిచెందిన వారి మృతదేహాలను ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా భారత్కు తరలించేలా కేరళా ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది.
గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వారి మృతదేహాలను ఎలాంటి ఖర్చు లేకుండా ఇండియా తరలించేందుకు ఎయిర్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. మృతదేహాలను సొంతదేశానికి తరలించేందుకు కంపెనీ యాజమాన్యం, రాయబార కార్యాలయం సహాయం చేయని సమయాల్లో కేరళా ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకం ఎంతగానో దోహపడుతోంది.
కేరళా ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు. గల్ఫ్ లో పని చేస్తూ మృతి చెందిన వారిని కనీసం సొంత దేశానికి కూడా తీసుకురాలేనంతగా ఒక్కోసారి ఆర్ధిక సమస్యలు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!









