ఉచితంగా గల్ఫ్ మృతదేహాలు తరలింపునకు కొత్త పథకం:కేరళ ప్రభుత్వం
- November 30, 2019
కేరళ:తమ రాష్ట్రం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన ప్రవాసీయులకు కేరళ ప్రభుత్వం ఊరటనిచ్చింది. అనారోగ్యంతో మృతిచెందిన వారి మృతదేహాలను ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా భారత్కు తరలించేలా కేరళా ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది.
గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వారి మృతదేహాలను ఎలాంటి ఖర్చు లేకుండా ఇండియా తరలించేందుకు ఎయిర్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. మృతదేహాలను సొంతదేశానికి తరలించేందుకు కంపెనీ యాజమాన్యం, రాయబార కార్యాలయం సహాయం చేయని సమయాల్లో కేరళా ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకం ఎంతగానో దోహపడుతోంది.
కేరళా ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు. గల్ఫ్ లో పని చేస్తూ మృతి చెందిన వారిని కనీసం సొంత దేశానికి కూడా తీసుకురాలేనంతగా ఒక్కోసారి ఆర్ధిక సమస్యలు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!