తెలంగాణ:విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ
- December 03, 2019
హైదరాబాద్: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇవ్వనున్నారు. ఆత్మరక్షణ శిక్షణ కోసం పాఠశాల విద్యాశాఖ రూ.1.38కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వందకు మించి విద్యార్థులున్న 1,513 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులకు కరాటే, జూడో వంటి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ.3వేలు చొప్పున మంజూరు చేశారు. వారంలో రెండు మార్షల్ ఆర్ట్స్ తరగతులను.. గంట చొప్పున నిర్వహించాలని పేర్కొన్నారు. జాతీయ క్రీడా సంస్థలు లేదా యూనివర్సిటీ నుంచి జూడో, మార్షల్ ఆర్ట్స్లో సర్టిఫికెట్ ఉన్న శిక్షకుడిని నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









