జాయేద్ మరియు గాంధీ చిత్రాలతో ప్రత్యేక పోస్టల్ కవర్ ను విడుదల చేసిన భారత్
- December 04, 2019
యూఏఈ 48 వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆయా దేశాల జాతీయ జెండాలతో కూడిన షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ మరియు మహాత్మా గాంధీ చిత్రాలతో ప్రత్యేక పోస్టల్ కవర్ ను భారత ప్రభుత్వం విడుదల చేసింది. న్యూ ఢిల్లీ లోని తాజ్ ప్యాలెస్లో భారత-యూఏఈ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్ బన్నా ఈ పోస్టల్ కవర్ ను ఆవిష్కరించారు. అనంతరం 'ఫిలేట్లీ' ఆధిపత్య అంశంగా అహ్మద్ అల్ బన్నా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కొనసాగింది. రిసెప్షన్లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్, డాక్టర్ అల్ బన్నా ఏర్పాటు చేసిన అరుదైన స్టాంపులను చూడటం జరిగింది.
కేరళకు చెందిన ప్రముఖ స్టాంప్ కలెక్టర్ ఉమ్మర్ ఫరూక్, తాను సేకరించిన వివిధ యూఏఈ స్టాంపులను ఈ ప్రదర్శనలో ఉంచారు. భారతదేశంలో ఇలాంటి స్టాంపులను ప్రదర్శించడం ఇదే మొదటిసారి అన్నారు. భారతదేశంలో ఫిలాటెలిస్టులు మాట్లాడుతూ, ప్రత్యేక పోస్టల్ కవర్ మరియు పోస్ట్ మార్క్ ఇవ్వడం భారతదేశంలో అరుదైన గౌరవం మరియు యూఏఈ మరియు భారతదేశం మధ్య ప్రస్తుత, అభివృద్ధి చెందుతున్న ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది.
ఈ ప్రదర్శనను భారత ప్రభుత్వ పోస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో దుబాయ్లోని ‘ఎమిరేట్స్ ఫిలాటెలిక్ అసోసియేషన్’ మరియు భారతదేశం లోని ‘ఆల్ ఇండియా ఫిలాటెలిక్ ఫెడరేషన్’ & ‘ఫిలాటెలిక్ సొసైటీ ఆఫ్ ఇండియా’ సంయుక్తంగా నిర్వహించారు.
ఈ సంవత్సరం జాతీయ దినోత్సవ రిసెప్షన్లో ఎమిరాతీ డిజైనర్ ‘షంసా అల్ మెహైరి’ రూపొందించిన సాంప్రదాయ యూఏఈ దుస్తులను కలిగి ఉన్న ఫ్యాషన్ షో అందరిని ఆకర్షించింది. యూఏఈ తో బలమైన వాణిజ్య మరియు సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్న స్థానిక సంస్థ ‘సి.డి. ఫౌండేషన్’ ఈ ఫ్యాషన్ షోను నిర్వహించింది.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం