జాయేద్ మరియు గాంధీ చిత్రాలతో ప్రత్యేక పోస్టల్ కవర్ ను విడుదల చేసిన భారత్
- December 04, 2019


యూఏఈ 48 వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆయా దేశాల జాతీయ జెండాలతో కూడిన షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ మరియు మహాత్మా గాంధీ చిత్రాలతో ప్రత్యేక పోస్టల్ కవర్ ను భారత ప్రభుత్వం విడుదల చేసింది. న్యూ ఢిల్లీ లోని తాజ్ ప్యాలెస్లో భారత-యూఏఈ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్ బన్నా ఈ పోస్టల్ కవర్ ను ఆవిష్కరించారు. అనంతరం 'ఫిలేట్లీ' ఆధిపత్య అంశంగా అహ్మద్ అల్ బన్నా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కొనసాగింది. రిసెప్షన్లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్, డాక్టర్ అల్ బన్నా ఏర్పాటు చేసిన అరుదైన స్టాంపులను చూడటం జరిగింది.
కేరళకు చెందిన ప్రముఖ స్టాంప్ కలెక్టర్ ఉమ్మర్ ఫరూక్, తాను సేకరించిన వివిధ యూఏఈ స్టాంపులను ఈ ప్రదర్శనలో ఉంచారు. భారతదేశంలో ఇలాంటి స్టాంపులను ప్రదర్శించడం ఇదే మొదటిసారి అన్నారు. భారతదేశంలో ఫిలాటెలిస్టులు మాట్లాడుతూ, ప్రత్యేక పోస్టల్ కవర్ మరియు పోస్ట్ మార్క్ ఇవ్వడం భారతదేశంలో అరుదైన గౌరవం మరియు యూఏఈ మరియు భారతదేశం మధ్య ప్రస్తుత, అభివృద్ధి చెందుతున్న ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది.
ఈ ప్రదర్శనను భారత ప్రభుత్వ పోస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో దుబాయ్లోని ‘ఎమిరేట్స్ ఫిలాటెలిక్ అసోసియేషన్’ మరియు భారతదేశం లోని ‘ఆల్ ఇండియా ఫిలాటెలిక్ ఫెడరేషన్’ & ‘ఫిలాటెలిక్ సొసైటీ ఆఫ్ ఇండియా’ సంయుక్తంగా నిర్వహించారు.
ఈ సంవత్సరం జాతీయ దినోత్సవ రిసెప్షన్లో ఎమిరాతీ డిజైనర్ ‘షంసా అల్ మెహైరి’ రూపొందించిన సాంప్రదాయ యూఏఈ దుస్తులను కలిగి ఉన్న ఫ్యాషన్ షో అందరిని ఆకర్షించింది. యూఏఈ తో బలమైన వాణిజ్య మరియు సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్న స్థానిక సంస్థ ‘సి.డి. ఫౌండేషన్’ ఈ ఫ్యాషన్ షోను నిర్వహించింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ









