జాయేద్ మరియు గాంధీ చిత్రాలతో ప్రత్యేక పోస్టల్ కవర్ ను విడుదల చేసిన భారత్
- December 04, 2019


యూఏఈ 48 వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆయా దేశాల జాతీయ జెండాలతో కూడిన షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ మరియు మహాత్మా గాంధీ చిత్రాలతో ప్రత్యేక పోస్టల్ కవర్ ను భారత ప్రభుత్వం విడుదల చేసింది. న్యూ ఢిల్లీ లోని తాజ్ ప్యాలెస్లో భారత-యూఏఈ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్ బన్నా ఈ పోస్టల్ కవర్ ను ఆవిష్కరించారు. అనంతరం 'ఫిలేట్లీ' ఆధిపత్య అంశంగా అహ్మద్ అల్ బన్నా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కొనసాగింది. రిసెప్షన్లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్, డాక్టర్ అల్ బన్నా ఏర్పాటు చేసిన అరుదైన స్టాంపులను చూడటం జరిగింది.
కేరళకు చెందిన ప్రముఖ స్టాంప్ కలెక్టర్ ఉమ్మర్ ఫరూక్, తాను సేకరించిన వివిధ యూఏఈ స్టాంపులను ఈ ప్రదర్శనలో ఉంచారు. భారతదేశంలో ఇలాంటి స్టాంపులను ప్రదర్శించడం ఇదే మొదటిసారి అన్నారు. భారతదేశంలో ఫిలాటెలిస్టులు మాట్లాడుతూ, ప్రత్యేక పోస్టల్ కవర్ మరియు పోస్ట్ మార్క్ ఇవ్వడం భారతదేశంలో అరుదైన గౌరవం మరియు యూఏఈ మరియు భారతదేశం మధ్య ప్రస్తుత, అభివృద్ధి చెందుతున్న ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది.
ఈ ప్రదర్శనను భారత ప్రభుత్వ పోస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో దుబాయ్లోని ‘ఎమిరేట్స్ ఫిలాటెలిక్ అసోసియేషన్’ మరియు భారతదేశం లోని ‘ఆల్ ఇండియా ఫిలాటెలిక్ ఫెడరేషన్’ & ‘ఫిలాటెలిక్ సొసైటీ ఆఫ్ ఇండియా’ సంయుక్తంగా నిర్వహించారు.
ఈ సంవత్సరం జాతీయ దినోత్సవ రిసెప్షన్లో ఎమిరాతీ డిజైనర్ ‘షంసా అల్ మెహైరి’ రూపొందించిన సాంప్రదాయ యూఏఈ దుస్తులను కలిగి ఉన్న ఫ్యాషన్ షో అందరిని ఆకర్షించింది. యూఏఈ తో బలమైన వాణిజ్య మరియు సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్న స్థానిక సంస్థ ‘సి.డి. ఫౌండేషన్’ ఈ ఫ్యాషన్ షోను నిర్వహించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







