సామాజిక మాధ్యమాల ద్వారా వీసాలను పొందడం అది అక్రమ మానవ రవాణ నేరం
- January 14, 2016
సామాజిక మాధ్యమాల ద్వారా విదేశీయులు కార్మిక మంత్రిత్వ శాఖ వీసాలను విక్రయించడం అది అక్రమ మానవ రవాణ నేరంగా పరిగణిస్తామని సౌదీ కు చెందిన మక్కహ్ పత్రిక పేర్కొంది. అంతర్జాతీయ న్యాయ ఆచార్యుడు అబ్దుల్సమెద్ అల్ అలీ మాట్లాడుతూ,అలీన దేశాల మధ్య ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం మానవ రవాణా ఏ రూపంలో జరిగినా అది పెద్ద తప్పు అని అన్నారు. పౌరులు
తప్పక తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వీసాను అందించిన నిర్వాహకుడు దానిని రూపొందించడం లేదా మార్చడం సరి కాదన్నారు. అవి ఎన్నడు చట్టబద్ధంగా జరగాలని సూచించారు. విదేశీయులకు వీసాను గూర్చిన సమాచారం సోషల్ మీడియా లో పోస్టింగులను పెట్టడం , వాటి అమ్మకాలను గూర్చి బేరసారాలు జరపడం అది అక్రమ మానవ రవాణ నేరమని అల్ అలీ అన్నారు. ఈ తరహ ఉచ్చులో ఎక్కువుగా విదేశీయులు చిక్కుకొంటున్నారని, అయెతే వారికి ఏకైక రక్షణ కార్మిక చట్టం మాత్రమె అని చెబ్తూ , గల్ఫ్ దేశాలకు వలస వచ్చే అత్యధికుల్లో
అక్షరాస్యత శాతం తక్కువని , వీరికి సౌదీలో అమలవుతున్న పటిష్టమైన కార్మిక చట్టం గూర్చి సరైనా అవగాహన లేదని తెలిపారు. దీంతో వారికి తమ తమ విధులు బాధ్యతలు తెలియకపోవడంతో మోసానికి గురికాబడుతున్నారు. చట్టపరమైన విధానాలతో కార్మిక నియామకం జరిగితే , అది కార్మికునికి మేలని, సోషల్ మీడియా ద్వారా నియామక కార్యాలయాలు ,విదేశీయులను తప్పు దారి పట్టిస్తున్నాయి అని
ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







