ముగ్గురు బీటెక్ విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన అమెరికన్ కంపెనీలు
- December 05, 2019
హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీరూర్కీ)కి చెందిన ముగ్గురు విద్యార్థులు బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఏకంగా సంవత్సరానికి 1.54 కోట్ల ప్యాకేజీతో వీరికి ఐఐటీ క్యాంపస్ సెలక్షన్స్లో అమెరికా కంపెనీలు ఆఫర్ ప్రకటించాయి. కేవలం బీటెక్ విద్యార్థులు ఇంత పెద్ద మొత్తంలో ప్యాకేజీ రావడం ఇదే ప్రథమమని ఐఐటీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ముగ్గురు విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ విభాగాల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇక్కడ జరిగిన క్యాంపస్ సెలక్షన్స్లో వీరిని ఎంపిక చేయగా.. మరో విద్యార్థి 62 లక్షల వార్షిక ప్యాకేజీతో ఎంపికయ్యారు. 30 అమెరికన్ MNC కంపెనీలు 363 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేయగా 322 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ కంపెనీలు ముగ్గురు విద్యార్థులకు 1.54 కోట్ల ప్యాకేజీతో ఎంపిక చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి అని ఐఐటీ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. కాగా, ఏ కంపెనీలు ఎవరికి ఎంత ప్యాకేజీతో తీసుకొన్నాయో పేర్లు వెల్లడించడానికి రూర్కీ ఐఐటీ వర్గాలు నిరాకరించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









