దిశ హత్యాచారంపై 'సిట్' ఏర్పాటు
- December 05, 2019
తెలంగాణ:భారత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం విచారణకు రాష్ట్రప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. కేసు విచారణను స్పీడుగా పూర్తి చేయటానికి బుధవారమే హై కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. గురువారం ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయటంతో కేసు విచారణను ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్ధమవుతోంది.
సిట్ బృందం శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో పని చేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో చెప్పింది. డిసిపి ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందంలో నలుగురు అడిషినల్ డిసిపిలున్నారు. వీరిలో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు. మొత్తం మీద దిశ హత్యాచారానికి పాల్పడి నలుగురు నిందులకు కోర్టు వారం రోజులు పోలీసు కస్టడీకి అప్పగించిన మరుసటి రోజే ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయటం గమనార్హం.
అంటే ఇప్పటి వరకూ జరిగిన మొత్తం విచారణ నివేదికను పోలీసులు సిట్ కు అప్పగించేస్తారు. ఇకనుండి విచారణ మొత్తాన్ని సిట్ తన బృందంతోనే ప్రత్యేకంగా చేస్తుంది. కేసు విచారణ విషయంలో కావచ్చు, నిందితుల విషయంలో కావచ్చు జనాల్లోని ఆగ్రహం చూసిన తర్వాత విచారణలో వేగాన్ని పెంచటానికి ప్రభుత్వం కూడా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకొంటోంది.
కేసు విచారణలో ఎక్కడైనా పొరబాటు జరిగితే ప్రత్యక్షంగా పోలీసు శాఖ మీద తర్వాత ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ అవుతుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకూ నలుగురు నిందితులే దిశపై హత్యాచారం చేశాడని నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాలను సేకరించటంలో దర్యాప్తు అధికారులు గట్టిగానే పనిచేస్తున్నారు.
జనాల ఆకాంక్షలకు అనుగుణంగా నిందితులు నలుగిరికి శిక్షలు పడాలంటే దర్యాప్తులో ఫోరెన్సిక్ నివేదికే చాలా కీలకమవుతుంది. అందుకనే దర్యాప్తును మామూలు పోలీసు అధికారుల పర్యవేక్షేణలో కాకుండా సీనియర్ అధికారులైన ఐపిఎస్ తో చేయించటమే మేలని ప్రభుత్వం భావించింది. అందుకనే వెంటనే సిట్ ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









