పెరల్ హార్బర్‌ కాల్పుల ఘటన: భారత ఐఏఎఫ్‌ చీఫ్‌ క్షేమం

- December 05, 2019 , by Maagulf
పెరల్ హార్బర్‌ కాల్పుల ఘటన: భారత ఐఏఎఫ్‌ చీఫ్‌ క్షేమం

హవాయి : ఐఏఎఫ్‌ చీఫ్‌ మార్షల్‌ రాకేశ్‌కుమార్‌ సింగ్‌ బదౌరియా క్షేమంగా ఉన్నారని వైమానిక దళ అధికార ప్రతినిధి గురువారం వెల్లడించారు. వివరాలు.. ఆసియా - పసిఫిక్‌ ప్రాంతంలో భద్రతపై చర్చించడానికి అమెరికా మిలిటరీ స్థావరమైన హవాయిలోని పెర్ల్‌ హార్బర్‌లో వివిధ దేశాల వాయుసేనాధ్యక్షులతో ఓ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి బదౌరియా అక్కడికి వెళ్లారు. అయితే బుధవారం పెర్ల్‌ హార్బర్‌ నౌకాశ్రయంలో ఓ సెయిలర్‌ ముగ్గురిని కాల్చి చంపేసి అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోబదౌరియా పెర్ల్‌హార్బర్‌లోని ఎయిర్‌ బేస్‌లో ఉన్నారని, కాల్పుల ఘటన నౌకాశ్రయంలో జరిగిందని అధికార ప్రతినిధి వివరించారు.

కాగా, అమెరికా నౌకాదళ సైన్యానికి పెరల్ హార్బర్ కేంద్రంగా ఉంది. ఇక్కడ భారీ నౌకలకు రిపేర్‌, మెయింటేన్ చేస్తారు. వాటిని ఆధునీకరిస్తారు. పెరల్ హార్బర్‌లోనే సుమారు 10 డెస్ట్రాయర్లు, 15 సబ్‌మెరైన్లు కూడా ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ దాడి చేసింది ఈ నాకౌశ్రయంపైనే. ఈ శనివారం ఆ దాడికి 78 ఏళ్ల పూర్తయ్యాయి. ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకునే కాల్పులు జరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com