నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ఆర్థిక శాఖ వివరణ
- December 05, 2019
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగాఉల్లి ధరల పెరుగుదలపై పార్లమెంట్లో చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్లో వైరల్గా మారాయి. తాను ఉల్లిపాయలు ఎక్కువగా తిననని, వాటితో పెద్దగా సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చానని ఆమె చేసిన వ్యాఖ్యలపై నెట్లో సెటైర్లు పేలుతున్నాయి. నిరుద్యోగం ఎందుకు పెరిగిపోయిందని నిర్మలను అడిగితే.. తన కుటుంబంలో ఎవరూ నిరుద్యోగులు లేరని విచిత్ర సమాధానం చెబుతారేమో అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగాయని ఆమెతో చెబితే.. తాను మంత్రినయినప్పటి నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడం లేదని అంటారేమోనని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
ఇలా ఉల్లిపాయపై ఆమె చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతుండటంతో ఆర్థిక శాఖ వివరణ ఇచ్చుకుంది. ఉల్లి ధరలపై ఆమె సరైన రీతిలోనే స్పందించారని, అందుకు సంబంధించిన పూర్తి వీడియో ఇదే అని నిర్మల ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఆర్థిక శాఖ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలోని ఓ క్లిప్ను ప్రచారం చేసి తప్పుదోవ పట్టించేందుకు వినియోగిస్తున్నారని ఆర్థిక శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!









