నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ఆర్థిక శాఖ వివరణ
- December 05, 2019
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగాఉల్లి ధరల పెరుగుదలపై పార్లమెంట్లో చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్లో వైరల్గా మారాయి. తాను ఉల్లిపాయలు ఎక్కువగా తిననని, వాటితో పెద్దగా సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చానని ఆమె చేసిన వ్యాఖ్యలపై నెట్లో సెటైర్లు పేలుతున్నాయి. నిరుద్యోగం ఎందుకు పెరిగిపోయిందని నిర్మలను అడిగితే.. తన కుటుంబంలో ఎవరూ నిరుద్యోగులు లేరని విచిత్ర సమాధానం చెబుతారేమో అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగాయని ఆమెతో చెబితే.. తాను మంత్రినయినప్పటి నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడం లేదని అంటారేమోనని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
ఇలా ఉల్లిపాయపై ఆమె చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతుండటంతో ఆర్థిక శాఖ వివరణ ఇచ్చుకుంది. ఉల్లి ధరలపై ఆమె సరైన రీతిలోనే స్పందించారని, అందుకు సంబంధించిన పూర్తి వీడియో ఇదే అని నిర్మల ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఆర్థిక శాఖ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలోని ఓ క్లిప్ను ప్రచారం చేసి తప్పుదోవ పట్టించేందుకు వినియోగిస్తున్నారని ఆర్థిక శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







