విజన్ 2030: వివిధ విదేశీ నిపుణులకు జాతీయతను మంజూరు చేయనున్న సౌదీ
- December 05, 2019రియాద్: 2016 లో ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకం సౌదీ విజన్ 2030 కు అనుగుణంగా చమురు ఆధారిత సౌదీ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరుస్తూ జాతీయ అభివృద్ధి మరియు పౌరుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రతిభావంతులైన విదేశీ నిపుణులకు సౌదీ జాతీయతను మంజూరు చేసేందుకు ఉత్తర్వులు జారీచేసిన సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్.
దాదాపు రెండు నెలల క్రితం జారీ చేసిన రాయల్ డిక్రీ ప్రకారం, ఇస్లామిక్ పండితులతో పాటు అణు మరియు పునరుత్పాదక ఇంధనం, మెడిసిన్, ఫార్మకాలజీ, కంప్యూటర్ సైన్స్, ఆయిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఎకాలజీ, ఆస్ట్రోనాటిక్స్, ఏవియేషన్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్ వంటి వివిధ విభాగాలలోని ప్రముఖ నిపుణులకు సౌదీ జాతీయత మంజూరు చేయబడుతుంది.
ఈ ప్రక్రియ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశిష్ట మరియు సృజనాత్మక వ్యక్తులు సౌదీ అరేబియాలో నివసించడానికి మరియు పని చేయడానికి మార్గం సుగమం అవుతుందని నివేదిక తెలిపింది. నివేదించబడిన సహజీకరణలో ముస్లిమేతర నిపుణులు కూడా ఉన్నారా అనేదానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ