నకిలీ గుర్తింపు కార్డు కలిగిన వ్యక్తి అరెస్ట్
- December 06, 2019
దుబాయ్:నకిలీ గుర్తింపు కార్డు కలిగిన ఓ నైజీరియా వ్యక్తికి దుబాయ్ న్యాయస్థానం మూడు నెలల జైలు శిక్ష విధించింది. మనీ ఎక్సేంజ్ ఆఫీస్లో మరో వ్యక్తికి చెందిన ఎమిరేట్స్ ఐడీ కార్డును చట్టవిరుద్ధంగా వినియోగించటంతో దోషికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. అతని శిక్షా కాలం పూర్తైన వెంటనే బహిష్కరణ అమల్లోకి వస్తుందని న్యాయస్థానం తెలిపింది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ రికార్డ్స్ ప్రకారం..శిక్ష పడిన నైజీరియన్ విజిట్ విసాపై దుబాయ్ వచ్చినట్లు తెలిపారు. గత నవంబర్ 11న నైఫ్ లోని మనీ ఎక్సేంజ్ కు వెళ్లిన నైజీరియన్, కెన్యా పౌరుడికి చెందిన ఎమిరేట్స్ ఐడీని తనదిగా చెప్పుకొని మోసానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
భారత్ కు చెందిన ఓ ఉద్యోగి మాట్లాడుతూ..తమ వద్దకు నైజీరియన్ మధ్యాహ్నం ఒంటి గంటా నలభైఐదు నిమిషాల సమయంలో వచ్చినట్లు వివరించారు. ఓమన్ పంపించేందుకు డబ్బు కలెక్ట్ చేస్తున్నట్లు చెప్పాడని వెల్లడించాడు. అయితే..తాను గుర్తింపు కార్డు అడగటంతో కెన్యాకు చెందిన వ్యక్తి ఐడీ కార్డును చూపించాడని భారతీయ ఉద్యోగి దోషి చేసిన మోసాన్ని వివరించాడు. పైగా నిందితుడి వ్యక్తిగత వివరాలు, ఐడీ కార్డులో పేర్కొన్న వివరాలతో సరిపోలేదని, దాంతో పోలీసులకు సమాచారం అందించడంతో అతన్ని అరెస్ట్ చేశారని వివరించాడు.
పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారణలో నైజీరియన్ తనపై మోపిన అభియోగాలను అంగీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అతని నుంచి ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. అయితే..ప్రస్తుత తీర్పుపై దోషి అప్పీల్ కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







