షార్జాలో భారత విద్యార్ధిని మృతి
- December 08, 2019షార్జాలో విషాదం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన 15 ఏళ్ల బాలిక పదో అంతస్తుపై నుంచి పడి మృతిచెందింది. పోలీసులు బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటన రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే..ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమెను కువైటీ ఆస్పత్రికి తీసుకొచ్చారని, అప్పటికే ఆమె మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..మృతురాలి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆల్ ఘర్బ్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. బాలిక మృతి కారణాలు, ఘటన జరిగిన తీరుపై తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సైంటిఫిక్ ఆధారాల కోసం మృతదేహ అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. చనిపోయిన బాలిక పదో గ్రేడ్ చదువుతోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ