ఇప్పుడు ఒమాన్ నుండి ఇండియాకు TV ని ఫ్రీ గా తీసుకెళ్ళచ్చు
- December 09, 2019
మస్కట్: సెలవలు వస్తున్నాయి..మరి స్వదేశానికి వెళ్తున్నారా? అయితే ఇది చదవండి.. డిసెంబర్లో ఒమాన్ లోని నిర్వాసితులు తమ కుటుంబాలను కలవడానికి వారి స్వదేశాలకు వెళుతుండటంతో, విమానయాన సంస్థలు తమ సామానులో భాగంగా కొనుగోలు చేసిన టివిని అదనపు ఖర్చు లేకుండా తీసుకోవడానికి అనుమతిస్తున్నాయి.
ఒక టీవీని కొనుగోలు చేసి తీసుకువెళుతున్న ప్రయాణీకులు ఇప్పుడు తమ చెక్-ఇన్ సామానులో భాగంగా టెలివిజన్ను చేర్చినప్పుడు ఒమన్ విమానాశ్రయాల నిర్వహణ ఛార్జీని OMR 4 మాత్రమే చెల్లించాలి. ఈ వెసులుబాటు అందిస్తున్న విమానయాన సంస్థలలో శ్రీలంక ఎయిర్లైన్స్ ఒకటి. మస్కట్ నుండి శ్రీలంకకు ప్రయాణించే ప్రయాణికులు శ్రీలంక ఎయిర్లైన్స్ లో ఇండియాకు ప్రయాణిస్తున్న వారు 55 అంగుళాల వరకు ఎల్ఈడి లేదా ఎల్సిడి టివిని ఉచితంగా తీసుకెళ్లవచ్చు.
ఢాకా కు ప్రయాణాన్ని ప్లాన్ చేసిన ప్రయాణీకులు అదనపు ఛార్జీ లేకుండా 43 అంగుళాల వరకు ఎల్సిడి టివిలను తీసుకెళ్లవచ్చు, అయితే 44 నుండి 55 అంగుళాల మధ్య టివిలను తీసుకెళ్లేవారు ఒఎంఆర్ 10 అదనపు ఛార్జీని చెల్లించాలి. టివి యొక్క గరిష్ట కొలతలు మించకూడదు 55 అంగుళాల పొడవు మించకూడదని షరతు విధించారు.
తాజా వార్తలు
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
- వినియోగదారుల రక్షణ కఠినమైన జరిమానాలు..!!
- మే 15 నుండి అబుదాబిలో డెలివరీ మోటార్సైకిళ్లపై నిషేధం..!!
- హంటావైరస్ ప్రమాదం చాలా తక్కువ.. సౌదీ అరేబియా
- వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ విధానం..!!
- అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!
- గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల తగ్గింపు..!!
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం









