కార్డియాక్ సెంటర్: ఇండియా - బహ్రెయిన్ సంబంధాల్లో కొత్త మైలు రాయి
- December 09, 2019
బహ్రెయిన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ (బిఎస్హెచ్) అపోలో హార్ట్ సెంటర్, మనామాలో నిన్న ప్రారంభమయ్యింది. బహ్రెయిన్ - ఇండియా మధ్య సంబంధాల్లో ఇదో కీలకమైన మైలు రాయి అని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి చెప్పారు. బహ్రెయిన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ వద్ద ప్రారంభమైన ఈ కొత్త హార్ట్ సెంటర్, హృదయ సంబంధ సమస్యలకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తుంది. హార్ట్ కేర్ రంగంలో ప్రపంచలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా అపోలో కీర్తింపబడ్తోంది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్యాత్ ల్యాబ్, కార్డియాక్ క్రిటికల్ కేర్ యూనిట్స్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వంటి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో వుంటాయి. బహ్రెయిన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కాసిమ్ అర్దాతి మాట్లాడుతూ, ఈ కొత్త హార్ట్ సెంటర్లో మినిమల్లీ ఇన్వాసివ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో వుంటాయని అన్నారు.
తాజా వార్తలు
- వినియోగదారుల రక్షణ కఠినమైన జరిమానాలు..!!
- మే 15 నుండి అబుదాబిలో డెలివరీ మోటార్సైకిళ్లపై నిషేధం..!!
- హంటావైరస్ ప్రమాదం చాలా తక్కువ.. సౌదీ అరేబియా
- వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ విధానం..!!
- అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!
- గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల తగ్గింపు..!!
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం









