కార్డియాక్ సెంటర్: ఇండియా - బహ్రెయిన్ సంబంధాల్లో కొత్త మైలు రాయి
- December 09, 2019
బహ్రెయిన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ (బిఎస్హెచ్) అపోలో హార్ట్ సెంటర్, మనామాలో నిన్న ప్రారంభమయ్యింది. బహ్రెయిన్ - ఇండియా మధ్య సంబంధాల్లో ఇదో కీలకమైన మైలు రాయి అని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి చెప్పారు. బహ్రెయిన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ వద్ద ప్రారంభమైన ఈ కొత్త హార్ట్ సెంటర్, హృదయ సంబంధ సమస్యలకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తుంది. హార్ట్ కేర్ రంగంలో ప్రపంచలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా అపోలో కీర్తింపబడ్తోంది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్యాత్ ల్యాబ్, కార్డియాక్ క్రిటికల్ కేర్ యూనిట్స్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వంటి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో వుంటాయి. బహ్రెయిన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కాసిమ్ అర్దాతి మాట్లాడుతూ, ఈ కొత్త హార్ట్ సెంటర్లో మినిమల్లీ ఇన్వాసివ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో వుంటాయని అన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







