కార్డియాక్ సెంటర్: ఇండియా - బహ్రెయిన్ సంబంధాల్లో కొత్త మైలు రాయి
- December 09, 2019
బహ్రెయిన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ (బిఎస్హెచ్) అపోలో హార్ట్ సెంటర్, మనామాలో నిన్న ప్రారంభమయ్యింది. బహ్రెయిన్ - ఇండియా మధ్య సంబంధాల్లో ఇదో కీలకమైన మైలు రాయి అని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి చెప్పారు. బహ్రెయిన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ వద్ద ప్రారంభమైన ఈ కొత్త హార్ట్ సెంటర్, హృదయ సంబంధ సమస్యలకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తుంది. హార్ట్ కేర్ రంగంలో ప్రపంచలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా అపోలో కీర్తింపబడ్తోంది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్యాత్ ల్యాబ్, కార్డియాక్ క్రిటికల్ కేర్ యూనిట్స్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వంటి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో వుంటాయి. బహ్రెయిన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కాసిమ్ అర్దాతి మాట్లాడుతూ, ఈ కొత్త హార్ట్ సెంటర్లో మినిమల్లీ ఇన్వాసివ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో వుంటాయని అన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







