సుడాన్:14 మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు
- December 10, 2019
సూడాన్:సూడాన్ దేశంలోని బహ్రీ నగరంలో గల కోబర్ నైబర్హుడ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని సలోమీ సిరామిక్ ఫ్యాక్టరీలో ఈ నెల 3న ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో 23 మంది సజీవ దహనమయ్యారు. మరో 130 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో 18 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి ఇండియన్ ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాగా, మంగళవారం నుంచి 14 మంది భారతీయుల మృతదేహాలను సుడాన్ నుంచి స్వదేశానికి పంపించనున్నారు. ఈ మేరకు భారత దౌత్యకార్యాలయం ఇప్పటి వరకు గుర్తించిన 14 మంది మృతుల వివరాలను తెలుపుతూ సోమవారం ఒక ట్వీట్ చేసింది. ఎంబసీ అధికారులు గుర్తించిన 14 మంది మృతుల్లో ఇద్దరు(హర్యానా), ముగ్గురు(బీహార్), ముగ్గురు(రాజస్థాన్), ముగ్గురు(యూపీ), ఇద్దరు(తమిళనాడు), ఒకరు(పుదుచ్చేరి) వాసులు ఉన్నారు.
హర్యానా నుంచి ప్రదీప్ కుమార్, పవన్ కుమార్... బీహార్ నుంచి నితీష్ మిశ్రా, నీరజ్ కుమార్ సింగ్, అమిత్ కుమార్ తీవారి... రాజస్థాన్ నుంచి రవీంద్ర కుమార్ మాన్, జైదీప్, కైలాష్ కాజ్లా... యూపీ నుంచి మోహిత్ కుమార్, ప్రదీప్ కుమార్ వర్మ, హరినాథ్ రాజ్బాహార్... తమిళనాడు నుంచి రామక్రిష్ణ రామలింగం, జయకుమార్ సెల్వరాజు... పుదుచ్చేరికి చెందిన వెంకటచలం చిదంబరం ఉన్నారు. మరో ఎనిమిది మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, అలాగే మరో 11 మంది ఆచూకీ లేదని శుక్రవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) పేర్కొంది. ఎంఈఏ ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ ప్రమాద సమయంలో మొత్తం 58 మంది భారతీయ కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నారని, వీరిలో 33 మంది సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు. ఇక ఈ ప్రమాదంపై గత వారం సూడాన్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం గ్యాస్ ట్యాంకర్లో సంభవించిన భారీ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయని వివరించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







