సుడాన్:14 మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు
- December 10, 2019
సూడాన్:సూడాన్ దేశంలోని బహ్రీ నగరంలో గల కోబర్ నైబర్హుడ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని సలోమీ సిరామిక్ ఫ్యాక్టరీలో ఈ నెల 3న ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో 23 మంది సజీవ దహనమయ్యారు. మరో 130 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో 18 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి ఇండియన్ ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాగా, మంగళవారం నుంచి 14 మంది భారతీయుల మృతదేహాలను సుడాన్ నుంచి స్వదేశానికి పంపించనున్నారు. ఈ మేరకు భారత దౌత్యకార్యాలయం ఇప్పటి వరకు గుర్తించిన 14 మంది మృతుల వివరాలను తెలుపుతూ సోమవారం ఒక ట్వీట్ చేసింది. ఎంబసీ అధికారులు గుర్తించిన 14 మంది మృతుల్లో ఇద్దరు(హర్యానా), ముగ్గురు(బీహార్), ముగ్గురు(రాజస్థాన్), ముగ్గురు(యూపీ), ఇద్దరు(తమిళనాడు), ఒకరు(పుదుచ్చేరి) వాసులు ఉన్నారు.
హర్యానా నుంచి ప్రదీప్ కుమార్, పవన్ కుమార్... బీహార్ నుంచి నితీష్ మిశ్రా, నీరజ్ కుమార్ సింగ్, అమిత్ కుమార్ తీవారి... రాజస్థాన్ నుంచి రవీంద్ర కుమార్ మాన్, జైదీప్, కైలాష్ కాజ్లా... యూపీ నుంచి మోహిత్ కుమార్, ప్రదీప్ కుమార్ వర్మ, హరినాథ్ రాజ్బాహార్... తమిళనాడు నుంచి రామక్రిష్ణ రామలింగం, జయకుమార్ సెల్వరాజు... పుదుచ్చేరికి చెందిన వెంకటచలం చిదంబరం ఉన్నారు. మరో ఎనిమిది మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, అలాగే మరో 11 మంది ఆచూకీ లేదని శుక్రవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) పేర్కొంది. ఎంఈఏ ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ ప్రమాద సమయంలో మొత్తం 58 మంది భారతీయ కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నారని, వీరిలో 33 మంది సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు. ఇక ఈ ప్రమాదంపై గత వారం సూడాన్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం గ్యాస్ ట్యాంకర్లో సంభవించిన భారీ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయని వివరించింది.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









