చరిత్ర సృష్టించిన సౌదీ అరామ్కో కంపెనీ
- December 12, 2019
సౌదీ అరేబియా: ఇటీవలే పబ్లిక్ ఇష్యూకు వచ్చిన సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ దిగ్గజం అరామ్కో.. ట్రేడింగ్ బుధవారంనాడు ప్రారంభమైంది. తొలి రోజే షేరు ధర దూసుకుపోయింది. ఆరంభంలోనే 10 శాతం మేర షేరు ధర పెరగడంతో కంపెనీ విలువ 1.88 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ఈ స్థాయిలో ప్రపంచంలో లిస్టయిన ఏ కంపెనీ మార్కెట్ విలువ లేదు. రియాద్లోని సౌదీ తడావుల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఉదయం 10.30 గంటలకు అరామ్కో షేర్ల ట్రేడింగ్ ఆరంభమైంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా 1.5 శాతం వాటాను విక్రయించారు. ఒక్కో షేరు ధరను 32 సౌదీ రియాల్స్ (8.53 డాలర్లు)గా నిర్ణయించారు. షేరు ధర 10 శాతం మేర పెరగడంతో 35.2 రియాల్స్కు చేరుకుంది. దీంతో మార్కెట్ విలువ 1.8 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రస్తుతం అరామ్కో మార్కెట్ విలువ మైక్రోసాఫ్ట్ లేదా యాపిల్కన్నా ఎక్కువగా ఉంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







