చరిత్ర సృష్టించిన సౌదీ అరామ్కో కంపెనీ
- December 12, 2019
సౌదీ అరేబియా: ఇటీవలే పబ్లిక్ ఇష్యూకు వచ్చిన సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ దిగ్గజం అరామ్కో.. ట్రేడింగ్ బుధవారంనాడు ప్రారంభమైంది. తొలి రోజే షేరు ధర దూసుకుపోయింది. ఆరంభంలోనే 10 శాతం మేర షేరు ధర పెరగడంతో కంపెనీ విలువ 1.88 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ఈ స్థాయిలో ప్రపంచంలో లిస్టయిన ఏ కంపెనీ మార్కెట్ విలువ లేదు. రియాద్లోని సౌదీ తడావుల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఉదయం 10.30 గంటలకు అరామ్కో షేర్ల ట్రేడింగ్ ఆరంభమైంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా 1.5 శాతం వాటాను విక్రయించారు. ఒక్కో షేరు ధరను 32 సౌదీ రియాల్స్ (8.53 డాలర్లు)గా నిర్ణయించారు. షేరు ధర 10 శాతం మేర పెరగడంతో 35.2 రియాల్స్కు చేరుకుంది. దీంతో మార్కెట్ విలువ 1.8 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రస్తుతం అరామ్కో మార్కెట్ విలువ మైక్రోసాఫ్ట్ లేదా యాపిల్కన్నా ఎక్కువగా ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







