చరిత్ర సృష్టించిన సౌదీ అరామ్కో కంపెనీ
- December 12, 2019
సౌదీ అరేబియా: ఇటీవలే పబ్లిక్ ఇష్యూకు వచ్చిన సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ దిగ్గజం అరామ్కో.. ట్రేడింగ్ బుధవారంనాడు ప్రారంభమైంది. తొలి రోజే షేరు ధర దూసుకుపోయింది. ఆరంభంలోనే 10 శాతం మేర షేరు ధర పెరగడంతో కంపెనీ విలువ 1.88 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ఈ స్థాయిలో ప్రపంచంలో లిస్టయిన ఏ కంపెనీ మార్కెట్ విలువ లేదు. రియాద్లోని సౌదీ తడావుల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఉదయం 10.30 గంటలకు అరామ్కో షేర్ల ట్రేడింగ్ ఆరంభమైంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా 1.5 శాతం వాటాను విక్రయించారు. ఒక్కో షేరు ధరను 32 సౌదీ రియాల్స్ (8.53 డాలర్లు)గా నిర్ణయించారు. షేరు ధర 10 శాతం మేర పెరగడంతో 35.2 రియాల్స్కు చేరుకుంది. దీంతో మార్కెట్ విలువ 1.8 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రస్తుతం అరామ్కో మార్కెట్ విలువ మైక్రోసాఫ్ట్ లేదా యాపిల్కన్నా ఎక్కువగా ఉంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







