ఎయిర్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం !
- December 13, 2019
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు సంబంధించి వందశాతం వాటా విక్రయించాలని నిర్ణయించింది. విమానయాన రంగాన్ని అభివృద్ధి చేసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి లోక్సభలో ప్రకటించారు.
ఎయిరిండియా.. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ. ఇది 94 జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు నడుపుతోంది. ఈ విమానయాన సంస్థ .. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సర్వీసులు నిర్వహిస్తోంది. ఎయిరిండియాకు అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది. దేశంలోని పౌర విమానయానంలో 18.6 శాతం కలిగి ఉంది. నాలుగు ఖండాల్లో 60 అంతర్జాతీయ గమ్యాలకు ప్రయాణీకులను చేరవేస్తోంది.
1932లో జెఆర్డీ టాటా.. ఈ ఎయిర్ లైన్స్ ను ప్రారంబించారు. కరాచీ నుంచి ముంబై వరకూ తర్వాత మద్రాస్కు పొడిగించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. అయితే క్రమంగా నష్టాలు పెరుగుతూ రావడంతో.. ఇండియన్ ఎయిర్ లైన్స్లో విలీనం చేశారు. అయినప్పటికీ ఎయిరిండియా నష్టాల నుంచి బయటకు రాలేదు. ఫలితంగా దీనిని ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు సంబంధించి 100శాతం వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి లోక్సభలో తెలిపారు.
విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా25వేల కోట్ల రూపాయలు కోరినట్లు తెలిపారు. 2018-19 సంవత్సరానికి ఎయిర్ ఇండియా 8 వేల,556కోట్లు నష్ట పోయిందన్నారు. 50 వేల కోట్ల రూపాయల అప్పులతో సతమతమవుతున్న ఎయిరిండియాకు.. అప్పులే పెను సమస్యగా మారాయని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







