అబుదాబి: లండన్ లో మృతి చెందిన ఒమని యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన యువరాజు
- December 14, 2019
లండన్ లో దోపిడి దొంగల దాడితో మృతి చెందిన ఒమని కుటుంబాన్ని అబుదాబి యువరాజు షేమ్ మొహమ్మద్ బిన్ జయాద్ పరామర్శించారు. మస్కట్ లో నివాసముంటున్న వ్యాపారవేత, అల్ రైడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని అబ్ధుల్లా అల్ అరైమి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబానికి సంతాపం ప్రకటించారు. అబ్దుల్లా అల్ అరైమి కుమారుడు మొహమ్మద్ అల్ అరైమీ గత డిసెంబర్ 6న దోపిడి దొంగల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మధ్యరాత్రి వేళ లండన్ లోని నైట్స్ బ్రిడ్జి ప్రాంతంలో ఈ దాడి జరిగింది. మొహమ్మద్ అల్ అరైమి లండన్ కింగ్స్ కాలేజీలో పాలిటిక్స్ &
ఎకనామిక్స్ చదువుతున్నాడు. భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో స్నేహితుడితో కలిసి నడిచివెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దాడిలో మొహమ్మద్ అల్ అరైమీ మృతి చెందగా..అతని స్నేహితుడికి గాయాలయ్యాయి. అయితే..ఘటనపై విచారణ జరుగుతోందని, పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉందని, దాడికి పాల్పడింది ఎవరో తెల్సుకోవాల్సి ఉందని లండన్ పోలీసులు చెబుతున్నారు.
కుమారుడి మరణంతో విషాదంలో మునిగిపోయిన అబ్దుల్లా అల్ అరైమి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఉప ప్రధాని షేక్ మన్సూర్ బిన్ జాయెద్ కూడా వ్యాపారవేత కుటుంబానికి సంతాపం తెలిపారు. తమ కుటుంబాన్ని పరామర్శించిన యువరాజుకు ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 6న జరిగిన దుర్ఘటన తమ జీవితంలో తేరుకోలేని విషాదాన్ని నింపిదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడి మృతి వార్తతో తమ గుండెలు బద్ధలైనంత పని జరిగిందన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







