అబుదాబి: లండన్ లో మృతి చెందిన ఒమని యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన యువరాజు

- December 14, 2019 , by Maagulf
అబుదాబి: లండన్ లో మృతి చెందిన ఒమని యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన యువరాజు

లండన్ లో దోపిడి దొంగల దాడితో మృతి చెందిన ఒమని కుటుంబాన్ని అబుదాబి యువరాజు షేమ్ మొహమ్మద్ బిన్ జయాద్ పరామర్శించారు. మస్కట్ లో నివాసముంటున్న వ్యాపారవేత, అల్ రైడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని అబ్ధుల్లా అల్ అరైమి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబానికి సంతాపం ప్రకటించారు. అబ్దుల్లా అల్ అరైమి కుమారుడు మొహమ్మద్ అల్ అరైమీ గత డిసెంబర్ 6న దోపిడి దొంగల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మధ్యరాత్రి వేళ లండన్ లోని నైట్స్ బ్రిడ్జి ప్రాంతంలో ఈ దాడి జరిగింది. మొహమ్మద్ అల్ అరైమి లండన్ కింగ్స్ కాలేజీలో పాలిటిక్స్ &
ఎకనామిక్స్ చదువుతున్నాడు.  భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో స్నేహితుడితో కలిసి నడిచివెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దాడిలో మొహమ్మద్ అల్ అరైమీ మృతి చెందగా..అతని స్నేహితుడికి గాయాలయ్యాయి. అయితే..ఘటనపై విచారణ జరుగుతోందని, పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉందని, దాడికి పాల్పడింది ఎవరో తెల్సుకోవాల్సి ఉందని లండన్ పోలీసులు చెబుతున్నారు.

కుమారుడి మరణంతో విషాదంలో మునిగిపోయిన అబ్దుల్లా అల్ అరైమి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఉప ప్రధాని షేక్ మన్సూర్ బిన్ జాయెద్ కూడా వ్యాపారవేత కుటుంబానికి సంతాపం తెలిపారు. తమ కుటుంబాన్ని పరామర్శించిన యువరాజుకు ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 6న జరిగిన దుర్ఘటన తమ జీవితంలో తేరుకోలేని విషాదాన్ని నింపిదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడి మృతి వార్తతో తమ గుండెలు బద్ధలైనంత పని జరిగిందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com