దుబాయ్: బస్సులో 20,000దిర్హామ్ లు..ఆ బస్సు డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?
- December 14, 2019
దుబాయ్:ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వ్యక్తికి కళ్ల ముందు నోట్ల కట్ట కనిపిస్తే ఏం చేస్తాడు? మనలో చాలా మంది గుట్టుచప్పుడు కాకుండా డబ్బు తీసుకొని ష్..గప్ చుప్ అనేస్తాం. కానీ, ఓ ఇండియన్ డ్రైవర్ మాత్రం తన నిజాయితీ చాటుకున్నాడు. తాను నడిపే బస్సులో 20 వేల దిర్హామ్ లు అతనికి దొరికినా..నిజాయితీగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. దుబాయ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బస్సు డ్రైవర్ పేరు అభిషేక్ నాథ్ గోవిందన్. దుబాయ్ ఆర్టీఏలో బస్సు డ్రైవర్. తన బస్సులో ఎవరో ప్రయాణికుడు మర్చిపోయిన 20,000 దిర్హామ్ లను తీసుకెళ్లి నైఫ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ తారీఖ్ మొహమ్మద్ నూర్ కి అప్పగించాడు. డ్రైవర్ అభిషేక్ నిజాయికి హ్యాట్సఫ్ కొట్టిన పోలీసులు అతన్ని సన్మానించారు. అతని నిజాయితీని మెచ్చుకుంటూ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ప్రజలు అభిషేక్ ను ఆదర్శంగా తీసుకోవాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!