దుబాయ్: బస్సులో 20,000దిర్హామ్ లు..ఆ బస్సు డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?
- December 14, 2019
దుబాయ్:ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వ్యక్తికి కళ్ల ముందు నోట్ల కట్ట కనిపిస్తే ఏం చేస్తాడు? మనలో చాలా మంది గుట్టుచప్పుడు కాకుండా డబ్బు తీసుకొని ష్..గప్ చుప్ అనేస్తాం. కానీ, ఓ ఇండియన్ డ్రైవర్ మాత్రం తన నిజాయితీ చాటుకున్నాడు. తాను నడిపే బస్సులో 20 వేల దిర్హామ్ లు అతనికి దొరికినా..నిజాయితీగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. దుబాయ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బస్సు డ్రైవర్ పేరు అభిషేక్ నాథ్ గోవిందన్. దుబాయ్ ఆర్టీఏలో బస్సు డ్రైవర్. తన బస్సులో ఎవరో ప్రయాణికుడు మర్చిపోయిన 20,000 దిర్హామ్ లను తీసుకెళ్లి నైఫ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ తారీఖ్ మొహమ్మద్ నూర్ కి అప్పగించాడు. డ్రైవర్ అభిషేక్ నిజాయికి హ్యాట్సఫ్ కొట్టిన పోలీసులు అతన్ని సన్మానించారు. అతని నిజాయితీని మెచ్చుకుంటూ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ప్రజలు అభిషేక్ ను ఆదర్శంగా తీసుకోవాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం
- చైనాలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- ప్రయాణికులకు మద్దతు..ఖతార్ రైల్ సన్ఫ్లవర్ ప్రోగ్రామ్..!!
- సాహెల్ యాప్ ద్వారా దేశీయ డ్రైవర్ వీసా సేవలు..!!
- దుబాయ్లోని దుకాణ యజమానులకు సైన్ బోర్డు రూల్స్..!!
- రియాద్లో జీసీసీ మంత్రుల అత్యవసర సమావేశం..!!
- ఏడాదిలో ఏడు కంటే ఎక్కువ ఉద్యోగాలను కలిగి ఉండటంపై నిషేధం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన జీసీసీ జుడిషియల్ మీటింగ్..!!
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...









