దుబాయ్: బస్సులో 20,000దిర్హామ్ లు..ఆ బస్సు డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?
- December 14, 2019
దుబాయ్:ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వ్యక్తికి కళ్ల ముందు నోట్ల కట్ట కనిపిస్తే ఏం చేస్తాడు? మనలో చాలా మంది గుట్టుచప్పుడు కాకుండా డబ్బు తీసుకొని ష్..గప్ చుప్ అనేస్తాం. కానీ, ఓ ఇండియన్ డ్రైవర్ మాత్రం తన నిజాయితీ చాటుకున్నాడు. తాను నడిపే బస్సులో 20 వేల దిర్హామ్ లు అతనికి దొరికినా..నిజాయితీగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. దుబాయ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బస్సు డ్రైవర్ పేరు అభిషేక్ నాథ్ గోవిందన్. దుబాయ్ ఆర్టీఏలో బస్సు డ్రైవర్. తన బస్సులో ఎవరో ప్రయాణికుడు మర్చిపోయిన 20,000 దిర్హామ్ లను తీసుకెళ్లి నైఫ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ తారీఖ్ మొహమ్మద్ నూర్ కి అప్పగించాడు. డ్రైవర్ అభిషేక్ నిజాయికి హ్యాట్సఫ్ కొట్టిన పోలీసులు అతన్ని సన్మానించారు. అతని నిజాయితీని మెచ్చుకుంటూ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ప్రజలు అభిషేక్ ను ఆదర్శంగా తీసుకోవాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు
- మార్కాపురం బస్సు ప్రమాదం...అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- వాయిదాలలో ఫోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- సాహ్ల్ యాప్ లో విమానయాన, ట్రావెల్ ఏజెన్సీల పై ఫిర్యాదులు..!!
- ఖతార్ లో స్కూల్ బస్సుల భద్రత పై మార్గదర్శకాలు జారీ..!!
- విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..









