దుబాయ్: బస్సులో 20,000దిర్హామ్ లు..ఆ బస్సు డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?
- December 14, 2019
దుబాయ్:ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వ్యక్తికి కళ్ల ముందు నోట్ల కట్ట కనిపిస్తే ఏం చేస్తాడు? మనలో చాలా మంది గుట్టుచప్పుడు కాకుండా డబ్బు తీసుకొని ష్..గప్ చుప్ అనేస్తాం. కానీ, ఓ ఇండియన్ డ్రైవర్ మాత్రం తన నిజాయితీ చాటుకున్నాడు. తాను నడిపే బస్సులో 20 వేల దిర్హామ్ లు అతనికి దొరికినా..నిజాయితీగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. దుబాయ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బస్సు డ్రైవర్ పేరు అభిషేక్ నాథ్ గోవిందన్. దుబాయ్ ఆర్టీఏలో బస్సు డ్రైవర్. తన బస్సులో ఎవరో ప్రయాణికుడు మర్చిపోయిన 20,000 దిర్హామ్ లను తీసుకెళ్లి నైఫ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ తారీఖ్ మొహమ్మద్ నూర్ కి అప్పగించాడు. డ్రైవర్ అభిషేక్ నిజాయికి హ్యాట్సఫ్ కొట్టిన పోలీసులు అతన్ని సన్మానించారు. అతని నిజాయితీని మెచ్చుకుంటూ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ప్రజలు అభిషేక్ ను ఆదర్శంగా తీసుకోవాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







