ఇండియా:పోస్టాఫీస్లో ఖాతాదారులకు శుభవార్త
- December 15, 2019
భారత కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన స్కీం (SSA) సహా పోస్టాఫీస్లో వివిధ సేవింగ్ స్కీంలు కలిగి ఉన్న వారికి శుభవార్త. ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన వంటి స్కీమ్స్ను పోస్టాఫీస్లో కడుతున్న వారు ఎంతో సంతోషించే వార్తను అందించింది పోస్టల్ డిపార్టుమెంట్. తాజాగా పోస్టాఫీస్ స్కీమ్స్కు సంబంధించి కొన్ని నిబంధనలు మార్చింది.
ప్రయోజనకరం
ఈ కొత్త నిబంధనలతో సుకన్య సమృద్ధి అకౌంట్ కలిగి ఉన్నవారికి ప్రయోజనం కలుగుతుంది. అలాగే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్ కలిగి ఉన్నవారికి కూడా లాభం చేకూరుతుంది. కొత్త నిబంధనతో నాన్ హోమ్ పోస్టాఫీస్ బ్రాంచీకి వెళ్లి చెక్ బుక్ ద్వారా డబ్బును చెల్లించవచ్చు. రూ.25,000కు పైన విలువైన చెక్స్ను ఇతర పోస్టాఫీస్ బ్రాంచీలకు వెళ్లి కూడా డిపాజిట్ చేసే వెసులుబాటును కల్పించింది.
ఏ బ్రాంచీకైనా వెళ్లి డిపాజిట్ చేయవచ్చు
ఇప్పటి వరకు రూ.25,000కు పైన విలువైన చెక్స్ను హోమ్ బ్రాంచీ కాకుండా ఇతర పోస్టాఫీస్ బ్రాంచీలకు వెళ్లి డిపాజిట్ చేసే సౌకర్యం లేదు. విత్ డ్రా చేసుకోవాలని భావిస్తే రూ.25,000 వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని సవరించింది. దీంతో పోస్టాఫీస్లో సేవింగ్ స్కీమ్స్ కలిగిన వారికి ఇది ఎంతో ప్రయోజనకరం. సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సహా ఇతర బ్రాంచీల్లోను అకౌంట్ చెక్ బుక్ ద్వారా డబ్బులు డిపాజిట్ చేవచ్చు. ఇప్పుడు ఏ బ్రాంచీకి వెళ్లైనా డిపాజిట్ చేయవచ్చు.
ఆన్ లైన్ ద్వారా కూడా
సుకన్య సమృద్ధి యోజన, ఆర్డీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో డబ్బులు ఆన్ లైన్ ద్వారా కూడా అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. SSAలో దాచుకున్న డబ్బును ఆడపిల్ల 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా ఉన్నత చదువుల కోసం లేదా పెళ్లి కోసం సగం తీసుకోవచ్చు. మిగతా మొత్తాన్ని మెచ్యూరిటీ తర్వాత తీసుకోవాలి. ఆన్ లైన్ ద్వారా డబ్బు డిపాజిట్ చేయవచ్చు. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఫెసిలిటీ పొందవచ్చు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







