షార్జా: ఖోర్ ఫక్కన్ లో ఫ్యామిలీ బీచ్ ప్రాజెక్ట్ ప్రారంభం
- December 16, 2019
యూ.ఏ.ఈ:ఖోర్ ఫక్కన్ సముద్ర తీరం మరింత అహ్లాదకరంగా, ఆటవిడుపు ఆకర్షణలతో షార్జా వాసులకు స్వాగతం పలుకుతోంది. వాటర్ స్పోర్ట్స్, ఇసుక కోట సైకత శిల్పాలతో రూపుదిద్దుకున్న కొత్త బీచ్ ప్రాజెక్ట్ ను షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఆదివారం ప్రారంభించారు. షార్జా ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్పర్సన్ షేఖా బోడోర్ బింట్ సుల్తాన్ అల్ ఖాసిమి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఫ్యామిలీ బీచ్ పార్క్ లో జాగింగ్, సైక్లింగ్ ట్రాక్స్, మల్టి స్పోర్ట్స్ కోర్ట్స్, స్విమ్మర్స్ బీచ్ తో పాటు పిల్లల కోసం ప్లేయింగ్ ఏరియా సౌకర్యాలను అభివృద్ధిచేశారు. పూర్తి పర్యావరణహితంగా రూపొందించిన ఈ బీచ్ లో షోకేస్ ఆర్ట్, మురల్స్ (కుడ్యచిత్రాలు) అదనపు ఆకర్షణ. బీచ్ ప్రాజెక్ట్ ఎక్స్ పీరియన్స్ ని ఎంజాయ్ చేయాలనుకునే సందర్శకులకు ఇటీవలె వేసిన షార్జా-ఖోర్ ఫక్కన్ హైవే పై వెళ్తే 45 నిమిషాల్లో బీచ్ కు చేరుకోవచ్చు.
బీచ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన షేక్ సుల్తాన్ అక్కడి బోట్ రేసుతో పాటు ప్రఖ్యాత ఎమారైటి కళాకారుడు మొహమ్మద్ అల్ అస్తాద్ వేసిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు.
తాజా వార్తలు
- ప్రమాదకర డ్రైవింగ్కు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు
- సైబర్ నేరాల నిర్మూలనకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: ఏపీ డీజీపీ..
- సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్నారై తెలుగుదేశం మహానాడు
- యూఏఈలో ఇళ్లు, వాహనాలు, కార్గోకు వార్ రిస్క్ ఇన్సూరెన్స్ విస్తరణ
- ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం నవంబరు 30 వరకు పొడిగింపు
- NEET లీకేజీ సూత్రధారి అరెస్ట్.. పుణేలో అదుపులోకి తీసుకున్న సీబీఐ..!
- విద్యార్థుల భద్రత కోసం ‘సురక్ష కవచ్’ హ్యాండ్బుక్ ఆవిష్కరణ
- న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ
- పుట్టపర్తిలో మూడు కీలక డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన
- జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ పై సీఎం రేవంత్ స్పష్టత









