విజయ్ దేవరకొండ తో రొమాన్స్కు జాన్వీ సై..
- December 16, 2019
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండకు తెలుగులోనే కాదు.. బాలీవుడ్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. బీ-టౌన్ హీరోయిన్లు అలియా భట్, జాన్వీ కపూర్, కియారా అద్వానీలకు రౌడీ మీద బిగ్ క్రష్ ఉందని చెప్పాలి. ఇక ప్రస్తుతం విజయ్ తన తదుపరి చిత్రం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా పూరి తెరకెక్కించనున్నాడు. దానికి అనుగుణంగానే బాలీవుడ్ వెర్షన్కు నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ప్రజెంట్ చేసేందుకు సిద్దమయ్యాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ భామను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చారు. కియారా అద్వానీ, అనన్య పాండే వంటి స్టార్ హీరోయిన్లతో సంప్రదింపులు జరిపారు కూడా. అయితే డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవడం వల్ల అందరూ కూడా నో చెప్పడం జరిగింది.
ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ ఎంపిక అయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాను జాన్వీ సైన్ చేయడానికి పరోక్షంగా కరణ్ జోహార్ కారణమని బీ-టౌన్ కోడై కూస్తోంది. స్టార్ డాటర్స్ అందరికి కరణ్ జోహార్ ఒక గాడ్ ఫాదర్ లెక్క. జాన్వీ విషయానికి వస్తే.. ఆమె మొదటి సినిమానే కాదు.. తాజాగా నటిస్తున్న సినిమాల్లో ఎంపికలో కూడా కరణ్ జోహార్ ప్రమేయం ఉంది.
అంతేకాకుండా గతంలో జాన్వీ 'కాఫీ విత్ కరణ్' షోకి వచ్చినప్పుడు విజయ్ మీద ఉన్న క్రష్ను బయటపెట్టింది. ఇలా ఈ రెండు కారణాల చేత జాన్వీ.. విజయ్ సినిమాకు ఓకే చెప్పి ఉండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్..ఎవరికి ఏ శాఖ?
- మల్కాజిగిరి కమిషనరేట్లో పోక్సో చట్టం అమలు పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం
- హయాకోమ్.. వరదల ఆందోళనలపై చర్చ..!!
- రియాద్ మెట్రో వెస్ట్రన్ స్టేషన్ ప్రారంభం..!!
- జనన, మరణ రిజిస్ట్రేషన్..వర్కింగ్ అవర్స్ ప్రకటించిన MoPH..!!
- సోషల్ మీడియాలో బంధువు ఫోటోలు పోస్ట్.. Dh3,000 ఫైన్..!!
- యంగ్ లీడర్స్.. మస్కట్ లో జాతీయ కార్యక్రమం ప్రారంభం..!!
- ఫ్లైట్ లో ప్రయాణికుడిని రక్షించిన యూఏఈ నర్సు..!!
- మే 23 నుండి బెంగళూరు–ముంబై కొత్త రైలు ప్రారంభం!
- SRH vs RCB మ్యాచ్ టికెట్ల పేరిట కొత్త సైబర్ దందా.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!









