దుబాయ్:మహిళపై అత్యాచారయత్నం..ముగ్గురు అరెస్ట్
- December 16, 2019
దుబాయ్:ఓ మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారయత్నానికి ఒడిగట్టిన కేసు దుబాయ్ కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ లో సోమవారం విచారణకు వచ్చింది. దుబాయ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ కు చెందిన 35 ఏళ్ల యువకుడికి 22 ఏళ్ల మొరాకో యువతితో వాట్సాప్ పరిచయం ఏర్పడింది. ఆ ఇద్దరు గత అక్టోబర్ లో మురాఖాబాద్ లోని ఓ చోట డిన్నర్ కు కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ మేరకు తాను మురఖాబాద్ కు చేరుకోగానే ఆ యువకుడు తనను అతని అఫీస్ కు తీసుకెళ్లినట్లు మొరాకో యువతి తెలిపింది.
ఆఫీస్ లో మరో ఇద్దరు స్నేహితులు పరిచయం చేసిన పాకిస్తానీ..తాను ఫుడ్ తీసుకురావటానికని బయటికి వెళ్లాడని ఆమె వెల్లడించింది. ఆ సమయంలో తనతో పాటే ఉన్న మరో వ్యక్తి అతనితో అఫైర్ పెట్టుకోవాలని బలవంత పెట్టాడని, తాను తిరస్కరించటంతో అతను తనపై దాడికి పాల్పడినట్లు బాధితురాలు చెబుతోంది. 43 ఏళ్ల వ్యాపారవేత్త తన వివస్త్రను చేసి మరో అఫీస్ రూంలో తనపై అఘాయిత్యానికి ఒడిగనట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తాను స్పృహలోకి రాగానే మూడో నిందితుడు కారు బుక్ చేసి తనను ఇంటికి పంపించినట్లు బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది.
" నాపై జరిగిన దాడి గురించి బంధువుకు చెప్పాను. రిలేటీవ్ ఇచ్చిన సలహాతో అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. వాట్సాప్ లో పరిచయమైన వ్యక్తి ఈ దారుణానికి ప్లాన్ చేయగా, రెండో వ్యక్తి నాపై అటాక్ చేశాడు. మూడో నిందితుడు అఫీస్ రూం డోర్ ను వెలుపలి నుంచి లాక్
చేశాడు" అని బాధితురాలు వెల్లడించింది.
బాధితురాలి ఫిర్యాదుతో ఆ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అఘాయిత్యానికి పాల్పడిన 43 ఏళ్ల పాకిస్తానీపై అత్యాచార అభియోగం కేసు నమోదు చేయగా..మిగిలిన ఇద్దరిపై నేరానికి సహాయం చేసినట్లుగా కేసు ఫైల్ చేశారు. ఈ కేసును సోమవారం విచారించిన దుబాయ్ కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 29కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









