ఆందోళనల నేపథ్యంలో భారత్ పర్యటించే ఎమిరాతీలకు యూఏఈ సూచనలు
- December 16, 2019
యూఏఈ:భారత్ లో పర్యటించే ఎమిరాతీలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీలోని యూఏఈ రాయబార కార్యాలయం జాగ్రత్త సూచనలు జారీ చేసింది. సిటిజన్ షిప్ అమెండ్మెంట్ బిల్లు-2019 నేపథ్యంలో ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో తమ పౌరులకు ఈ జాగ్రత్త సూచనలు చేసింది. అల్లర్లు జరిగే ప్రాంతాల్లో పర్యటించొద్దని సూచించింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 00919911120000 నెంబర్ కు కాంటాక్ట్ కావాలని పేర్కొంది.
గత రెండు రోజుల క్రితం సౌదీ అరేబియా, యూఎస్, యూకే కూడా తమ దేశ పౌరులకు ఇలాంటి సూచనలనే జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లర్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఈశాన్య ప్రాంతాల్లో పర్యటినలను మానుకోవాలని ఆయా దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేశాయి.
తాజా వార్తలు
- భగీరథ్ కు 14 రోజుల రిమాండ్..చర్లపల్లి జైలుకు తరలింపు
- మోదీ నెదర్లాండ్స్ పర్యటనలో..కుదిరిన కీలక డీల్
- కువైట్లో ఘనంగా NRI TDP మహానాడు వేడుకలు
- హోర్ముజ్ లో ఇరాన్ దాడులు..ఐఎంఓ అధిపతితో లానా నుస్సేబే చర్చలు..!!
- 19 భాషలు, 1,300 డిజిటల్ సేవలతో యాత్రికులకు మద్దతు ..!!
- మార్కెట్లో నకిలీ వస్తువులు..వాణిజ్య మంత్రిత్వ శాఖ స్వాధీనం!!
- 2026-2027 రెసిడెన్సీ ప్రోగ్రామ్..దరఖాస్తులకు ఆహ్వానం..!!
- ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడు కార్లలో నిద్రపోవద్దు..అలెర్ట్ జారీ..!!
- సురక్షితమైన భోజనం, ఆహార తయారీ పై ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ అలెర్ట్..!!
- తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్..ఎవరికి ఏ శాఖ?









