యూఏఈ: అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..150 కుటుంబాల తరలింపు
- December 18, 2019
యూఏఈలోని ఫుజైరహ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. అల్ ఖైల్ అపార్ట్మెంట్ బిల్డింగ్ లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల నుంచి సమచారం అందుకున్న సివిల్ డిఫిన్స్ అధికారులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో 48 అపార్ట్మెంట్ భవనాలు ఉన్నాయి. దీంతో మంటలు చుట్టుపక్కల బిల్డింగ్ లకు వ్యాపించకముందే భవనాల్లోని 150 కుటుంబాలను అగ్నిమాపక సిబ్బంది అక్కడ్నుంచి తరలించింది. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అపార్ట్మెంట్ ఏడో అంతస్తులోని కిచెన్ నుంచి మంటలు చెలరేగినట్లు ఫుజైరహ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ ఖలీద్ అల్ హమౌదీ తెలిపారు. మంటలు వేగంగా ఇతర గదులకు విస్తరించటంతో వస్తువులు తగలబడినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదాల సమయాల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని నివారించేందుకు బిల్డింగ్ యజమానులు అగ్నిమాపక శాఖ సూచనలను పాటించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- IPL2026: ప్లే ఆఫ్స్కు హైదరాబాద్..చెన్నై ఘన విజయం
- 'స్మైలింగ్ బుద్ధా' అణు పరీక్షకు 52 ఏళ్లు: మల్లికార్జున ఖర్గే
- నక్సల్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం..!
- అత్యంత అరుదైన కిడ్నీ క్యాన్సర్ను జయించిన 8 నెలల చిన్నారి
- మహారాష్ట్ర విద్యార్థులతో ‘యువ సంగం’ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఎస్ఐబీ కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్
- కర్ణాటక దుబారే క్యాంప్లో విషాదం..
- ఢిల్లీలో మెరిసిన భారత తొలి బుల్లెట్ ట్రైన్ లుక్!
- శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
- యూఏఈ ప్రైవేట్ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు









