యూఏఈ: అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..150 కుటుంబాల తరలింపు
- December 18, 2019
యూఏఈలోని ఫుజైరహ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. అల్ ఖైల్ అపార్ట్మెంట్ బిల్డింగ్ లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల నుంచి సమచారం అందుకున్న సివిల్ డిఫిన్స్ అధికారులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో 48 అపార్ట్మెంట్ భవనాలు ఉన్నాయి. దీంతో మంటలు చుట్టుపక్కల బిల్డింగ్ లకు వ్యాపించకముందే భవనాల్లోని 150 కుటుంబాలను అగ్నిమాపక సిబ్బంది అక్కడ్నుంచి తరలించింది. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అపార్ట్మెంట్ ఏడో అంతస్తులోని కిచెన్ నుంచి మంటలు చెలరేగినట్లు ఫుజైరహ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ ఖలీద్ అల్ హమౌదీ తెలిపారు. మంటలు వేగంగా ఇతర గదులకు విస్తరించటంతో వస్తువులు తగలబడినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదాల సమయాల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని నివారించేందుకు బిల్డింగ్ యజమానులు అగ్నిమాపక శాఖ సూచనలను పాటించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









