యూఏఈ: అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..150 కుటుంబాల తరలింపు
- December 18, 2019
యూఏఈలోని ఫుజైరహ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. అల్ ఖైల్ అపార్ట్మెంట్ బిల్డింగ్ లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల నుంచి సమచారం అందుకున్న సివిల్ డిఫిన్స్ అధికారులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో 48 అపార్ట్మెంట్ భవనాలు ఉన్నాయి. దీంతో మంటలు చుట్టుపక్కల బిల్డింగ్ లకు వ్యాపించకముందే భవనాల్లోని 150 కుటుంబాలను అగ్నిమాపక సిబ్బంది అక్కడ్నుంచి తరలించింది. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అపార్ట్మెంట్ ఏడో అంతస్తులోని కిచెన్ నుంచి మంటలు చెలరేగినట్లు ఫుజైరహ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ ఖలీద్ అల్ హమౌదీ తెలిపారు. మంటలు వేగంగా ఇతర గదులకు విస్తరించటంతో వస్తువులు తగలబడినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదాల సమయాల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని నివారించేందుకు బిల్డింగ్ యజమానులు అగ్నిమాపక శాఖ సూచనలను పాటించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







