పోర్టులతో దుబాయ్ ని లింక్ చేస్తూ కీలక రైల్వే లైనుకు గ్రీన్ సిగ్నల్

- December 19, 2019 , by Maagulf
పోర్టులతో దుబాయ్ ని లింక్ చేస్తూ కీలక రైల్వే లైనుకు గ్రీన్ సిగ్నల్

యూ.ఏ.ఈ:వాణిజ్య నగరం దుబాయ్ తో ఫుజైరహ్, ఖర్ఫాఖాన్ పోర్టులను కలుపుతూ కొత్త రైల్వే లైను టెండర్ ను ఎతిహద్ రైల్వే బోర్డు ఆమోదించింది. 4.6 బిలియన్ దిర్హామ్ లతో స్టేజ్ 2లోని ప్యాకేజీ డీలో సివిల్ వర్క్ పనులు చేపట్టేందుకు టెండర్ ఖరారు చేసింది. యూనైటెడ్ అరబ్ కంట్రీస్ లో అతిపెద్ద కమర్షియల్ క్యాపిటల్ సిటీ దుబాయ్ ని పోర్టులకు లింక్ చేయటంతో ఎక్స్ పోర్ట్స్, ఇంపోర్ట్స్ గూడ్స్ రవాణా మరింత సులువు కానుంది. ఈ రైలు మార్గాన్నిఎమిరాతిలతో అనుసంధానం చేయటం ద్వారా ఏడాదికి దాదాపు 2మిలియన్ల కంటైనర్ల సరుకు రవాణా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రమోషన్ కు ఈ కొత్త రైల్వే లైను దోహదం చేయనుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ను ఎమిరాతి పాలకులు కీలకంగా భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com