ముషారఫ్ మృతదేహాన్ని మూడురోజులు ఉరితాడుకు వేలాడదీయాలి: పాక్ న్యాయమూర్తి
- December 20, 2019
పాక్ మాజీ అధ్యక్షుడు ముషారప్కు మరణశిక్ష అమలుపై ఆ దేశ ప్రత్యేక కోర్టు.. కీలక వాఖ్యలు చేసింది. ఒక వేళ మరణశిక్ష అమలు చేయడానికి ముందే ముషారఫ్ చనిపోతే.. ఆయన మృతదేహాన్ని ఇస్లామాబాద్లోని సెంట్రల్ స్క్వేర్కు ఈడ్చుకొచ్చి.. మూడ్రోజులు పాటు ఉరితాడుకు వేలాడతీయాలని వ్యాఖ్యానించింది. అధికారంలో ఉండగా.. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేయడం, ఎమెర్జెన్సీ విధించడం ద్వారా ముషారఫ్ దేశద్రోహానికి పాల్పడ్డారని త్రిసభ్య ధర్మాసనం ఉరిశిక్ష విధించింది. పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ రాసిన 167 పేజీల తీర్పు కాపీ బయటికి వచ్చింది.
ఈ తీర్పు కాపీలో చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరారీలో ఉన్న ముషారప్ను పట్టుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారాయన. ఒకవేళ ముషారఫ్ సజీవంగా దొరక్కపోతే.. ఆయన మృతదేహాన్ని ఇస్లామాబాద్లోని డీ చౌక్కు ఈడ్చుకు రావాలని తీర్పు కాపీలో పేర్కొన్నారు. అనంతరం మూడ్రోజుల పాటు ఉరితాడుకు వేలాడదీయాలంటూ.. అందులో రాశారు. న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలపై సైన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..