ముషారఫ్ మృతదేహాన్ని మూడురోజులు ఉరితాడుకు వేలాడదీయాలి: పాక్ న్యాయమూర్తి
- December 20, 2019
పాక్ మాజీ అధ్యక్షుడు ముషారప్కు మరణశిక్ష అమలుపై ఆ దేశ ప్రత్యేక కోర్టు.. కీలక వాఖ్యలు చేసింది. ఒక వేళ మరణశిక్ష అమలు చేయడానికి ముందే ముషారఫ్ చనిపోతే.. ఆయన మృతదేహాన్ని ఇస్లామాబాద్లోని సెంట్రల్ స్క్వేర్కు ఈడ్చుకొచ్చి.. మూడ్రోజులు పాటు ఉరితాడుకు వేలాడతీయాలని వ్యాఖ్యానించింది. అధికారంలో ఉండగా.. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేయడం, ఎమెర్జెన్సీ విధించడం ద్వారా ముషారఫ్ దేశద్రోహానికి పాల్పడ్డారని త్రిసభ్య ధర్మాసనం ఉరిశిక్ష విధించింది. పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ రాసిన 167 పేజీల తీర్పు కాపీ బయటికి వచ్చింది.
ఈ తీర్పు కాపీలో చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరారీలో ఉన్న ముషారప్ను పట్టుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారాయన. ఒకవేళ ముషారఫ్ సజీవంగా దొరక్కపోతే.. ఆయన మృతదేహాన్ని ఇస్లామాబాద్లోని డీ చౌక్కు ఈడ్చుకు రావాలని తీర్పు కాపీలో పేర్కొన్నారు. అనంతరం మూడ్రోజుల పాటు ఉరితాడుకు వేలాడదీయాలంటూ.. అందులో రాశారు. న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలపై సైన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









