ఉమ్ అల్ కువైన్:ఇండస్ట్రీయర్ ఎస్టేట్ లో ఫైర్ యాక్సిడెంట్, 90 మంది ఆసియా కార్మికులు సేఫ్
- December 21, 2019ఉమ్ అల్ కువైన్ లోని ఉమ్ అల్ తౌబ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం తెల్లవారుజామున వార్ హౌజ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో అక్కడ 90 మంది ఆసియా కార్మికులు ఉన్నారు. అయితే వారందరు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం విషయాన్ని కార్మికులు ఫోన్ చేసి తమకు సమాచారం అందించారని సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సలెమ్ హమద్ బిన్ హమ్దా వెల్లడించారు. వెంటనే ఫైర్ ఫైటర్స్ ను సంఘటన స్థలానికి పంపించి సహాయక చర్యలు చేపట్టామని, కార్మికులను అక్కడి నుంచి తరలించామని ఆయన తెలిపారు. ప్రమాదంలో కార్మికులు అందరూ సేఫ్ గా బయటపడినా..వార్ హౌజ్ (గోడౌన్) మాత్రం పూర్తిగా కాలిపోయింది. అగ్నిప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి