యూఏఈ నేషనల్ బ్రాండ్ : వారంలో 1.5 మిలియన్ ఓటింగ్
- December 22, 2019
యూఏఈ నేషనల్ బ్రాండ్ సెలక్ట్ చేసేందుకు చేపట్టిన ఓటింగ్ కు జనం నుంచి భారీ స్పందన వచ్చింది. కేవలం వారం రోజుల్లో 1.5 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. 130 దేశాలు..2000 సిటీస్ నుంచి ఈ ఓట్లు పోల్ అయ్యాయి. యూఏఈ గ్లోబల్ లోగో ఎంపిక చేసేందుకు గత మంగళవారం నుంచి ఓటింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు లోగోలు 'ఎమిరేట్స్ ఇన్ కాలిగ్రాఫి', 'ది పామ్' మరియు '7 లైన్స్' లలో ఒక లోగోను సెలక్ట్ చేయాల్సి ఉంది. లోగో ఓటింగ్ తో పాటు వెబ్ సైట్ వ్యూస్ కూడా అంతే భారీ సంఖ్యలో ఉన్నాయి. లోగో క్యాంపేన్ చేపట్టిన నాటి నుంచి www.nationbrand.ae వెబ్ సైట్ కు దాదాపు 50 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆన్ లైన్ ఓటింగ్ తో పాటు ఫిజికల్ ఓటింగ్ కూడా చేపట్టిన అధికారులు..పలు మాల్స్ లో పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అబుదాబి- యస్ మాల్, దుబాయ్- గ్లోబల్ విలేజ్ & సిటీ వాక్, షార్జా- సిటీ సెంటర్, అజ్మన్ - సిటీ సెంటర్ , రస్ అల్ ఖైమా - సిటీ సెంటర్, ఫుజైరహ్ - సిటీ సెంటర్ మాల్స్ లో ఓట్ పోల్ చేయొచ్చు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







