ఫేస్బుక్ వినియోగదారులకు మరో షాక్
- December 22, 2019
వియత్నాం: 26.7కోట్ల ఫేస్బుక్ వినియోగదారుల డేటా వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కాయి. వారికి సంబంధించిన సున్నిత వివరాలను హ్యాకర్లు హస్తగతం చేసుకున్నట్లు కంపారిటెక్ సంస్థకు చెందిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ జాబ్ డయాచెక్ నో గుర్తించారు. ఈ సంవత్సరంలో ఏకంగా ఇది మూడోసారి. ఈ సారి హ్యాకర్ల చేతిలో ఫేస్బుక్ యూజర్ల విశిష్ట సంఖ్య(యూఐడి) కూడా ఉందని ఇది అందరిని ఆందోళనలోకి నెట్టే అంశమని జాబ్ తెలియజేశారు. వియత్నాం కేంద్రంగా హ్యాకర్లు రెచ్చిపోయారని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వివరాలను హ్యాక్ చేయకుండా ఉండాలంటే సెండ్ డేటా టూ సెర్చింజన్స్ అనే ఆప్షన్ను వెంటనే డిసేబుల్ చేస్తే సరిపోతుందని అన్నారు. ఇక తమ వినియోగదారుల సమాచారాన్ని కాపాడటంలో ఫేస్ బుక్ సైబర్ సెక్యూరిటీ వింగ్ పదేపదే విఫలం అవుతుండటంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత సంవత్సరం అక్టోబరులో 2.90 కోట్ల మంది డేటాను హ్యాకర్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఫేస్ బుక్ యాజమాన్యం స్వయంగా వెల్లడించింది. ఆపై డిసెంబరులో 68 లక్షల మంది వినియోగదారుల డేటా లీక్ కాగా, క్షమాపణలు కూడా చెప్పింది. ఆపై ఏప్రిల్ లో 54 కోట్ల మంది. సెప్టెంబరులో 41.9 కోట్ల మంది డేటా లీకయ్యింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!