ఫేస్బుక్ వినియోగదారులకు మరో షాక్
- December 22, 2019
వియత్నాం: 26.7కోట్ల ఫేస్బుక్ వినియోగదారుల డేటా వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కాయి. వారికి సంబంధించిన సున్నిత వివరాలను హ్యాకర్లు హస్తగతం చేసుకున్నట్లు కంపారిటెక్ సంస్థకు చెందిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ జాబ్ డయాచెక్ నో గుర్తించారు. ఈ సంవత్సరంలో ఏకంగా ఇది మూడోసారి. ఈ సారి హ్యాకర్ల చేతిలో ఫేస్బుక్ యూజర్ల విశిష్ట సంఖ్య(యూఐడి) కూడా ఉందని ఇది అందరిని ఆందోళనలోకి నెట్టే అంశమని జాబ్ తెలియజేశారు. వియత్నాం కేంద్రంగా హ్యాకర్లు రెచ్చిపోయారని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వివరాలను హ్యాక్ చేయకుండా ఉండాలంటే సెండ్ డేటా టూ సెర్చింజన్స్ అనే ఆప్షన్ను వెంటనే డిసేబుల్ చేస్తే సరిపోతుందని అన్నారు. ఇక తమ వినియోగదారుల సమాచారాన్ని కాపాడటంలో ఫేస్ బుక్ సైబర్ సెక్యూరిటీ వింగ్ పదేపదే విఫలం అవుతుండటంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత సంవత్సరం అక్టోబరులో 2.90 కోట్ల మంది డేటాను హ్యాకర్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఫేస్ బుక్ యాజమాన్యం స్వయంగా వెల్లడించింది. ఆపై డిసెంబరులో 68 లక్షల మంది వినియోగదారుల డేటా లీక్ కాగా, క్షమాపణలు కూడా చెప్పింది. ఆపై ఏప్రిల్ లో 54 కోట్ల మంది. సెప్టెంబరులో 41.9 కోట్ల మంది డేటా లీకయ్యింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









