ఫేస్బుక్ వినియోగదారులకు మరో షాక్
- December 22, 2019
వియత్నాం: 26.7కోట్ల ఫేస్బుక్ వినియోగదారుల డేటా వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కాయి. వారికి సంబంధించిన సున్నిత వివరాలను హ్యాకర్లు హస్తగతం చేసుకున్నట్లు కంపారిటెక్ సంస్థకు చెందిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ జాబ్ డయాచెక్ నో గుర్తించారు. ఈ సంవత్సరంలో ఏకంగా ఇది మూడోసారి. ఈ సారి హ్యాకర్ల చేతిలో ఫేస్బుక్ యూజర్ల విశిష్ట సంఖ్య(యూఐడి) కూడా ఉందని ఇది అందరిని ఆందోళనలోకి నెట్టే అంశమని జాబ్ తెలియజేశారు. వియత్నాం కేంద్రంగా హ్యాకర్లు రెచ్చిపోయారని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వివరాలను హ్యాక్ చేయకుండా ఉండాలంటే సెండ్ డేటా టూ సెర్చింజన్స్ అనే ఆప్షన్ను వెంటనే డిసేబుల్ చేస్తే సరిపోతుందని అన్నారు. ఇక తమ వినియోగదారుల సమాచారాన్ని కాపాడటంలో ఫేస్ బుక్ సైబర్ సెక్యూరిటీ వింగ్ పదేపదే విఫలం అవుతుండటంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత సంవత్సరం అక్టోబరులో 2.90 కోట్ల మంది డేటాను హ్యాకర్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఫేస్ బుక్ యాజమాన్యం స్వయంగా వెల్లడించింది. ఆపై డిసెంబరులో 68 లక్షల మంది వినియోగదారుల డేటా లీక్ కాగా, క్షమాపణలు కూడా చెప్పింది. ఆపై ఏప్రిల్ లో 54 కోట్ల మంది. సెప్టెంబరులో 41.9 కోట్ల మంది డేటా లీకయ్యింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







