ఫేస్బుక్ వినియోగదారులకు మరో షాక్
- December 22, 2019
వియత్నాం: 26.7కోట్ల ఫేస్బుక్ వినియోగదారుల డేటా వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కాయి. వారికి సంబంధించిన సున్నిత వివరాలను హ్యాకర్లు హస్తగతం చేసుకున్నట్లు కంపారిటెక్ సంస్థకు చెందిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ జాబ్ డయాచెక్ నో గుర్తించారు. ఈ సంవత్సరంలో ఏకంగా ఇది మూడోసారి. ఈ సారి హ్యాకర్ల చేతిలో ఫేస్బుక్ యూజర్ల విశిష్ట సంఖ్య(యూఐడి) కూడా ఉందని ఇది అందరిని ఆందోళనలోకి నెట్టే అంశమని జాబ్ తెలియజేశారు. వియత్నాం కేంద్రంగా హ్యాకర్లు రెచ్చిపోయారని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వివరాలను హ్యాక్ చేయకుండా ఉండాలంటే సెండ్ డేటా టూ సెర్చింజన్స్ అనే ఆప్షన్ను వెంటనే డిసేబుల్ చేస్తే సరిపోతుందని అన్నారు. ఇక తమ వినియోగదారుల సమాచారాన్ని కాపాడటంలో ఫేస్ బుక్ సైబర్ సెక్యూరిటీ వింగ్ పదేపదే విఫలం అవుతుండటంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత సంవత్సరం అక్టోబరులో 2.90 కోట్ల మంది డేటాను హ్యాకర్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఫేస్ బుక్ యాజమాన్యం స్వయంగా వెల్లడించింది. ఆపై డిసెంబరులో 68 లక్షల మంది వినియోగదారుల డేటా లీక్ కాగా, క్షమాపణలు కూడా చెప్పింది. ఆపై ఏప్రిల్ లో 54 కోట్ల మంది. సెప్టెంబరులో 41.9 కోట్ల మంది డేటా లీకయ్యింది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







