ఢిల్లీ లో అగ్ని ప్రమాదం..
- December 23, 2019
ఢిల్లీ లోని కిరారి ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ వస్త్ర గోదాంలో సోమవారం వేకువజామున భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కనీసం తొమ్మిది మంది మృతి చెందారు. మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 12.30గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
డిసెంబర్ 8న అనాజ్మండీ ప్రాంతంలోని ఓ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం రూ.2లక్షలు, కేంద్ర రూ.10లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ ఘటన మరువక ముందే మరో భారీ ప్రమాదం సంభవించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







