టీవీ సెలబ్రిటీ చెఫ్ మృతి..పోస్టుమార్టం తర్వాతే మృతికి గల కారణాలు వెల్లడి

- December 24, 2019 , by Maagulf
టీవీ సెలబ్రిటీ చెఫ్ మృతి..పోస్టుమార్టం తర్వాతే మృతికి గల కారణాలు వెల్లడి

తిరువనంతపురం (కేరళ): టీవీ ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరంలోని కురావాన్ కోణం ప్రాంతంలోని తన ఇంట్లోని వంటగదిలో జాగీ జాన్ మృతదేహం సోమవారం సాయంత్రం లభ్యమైంది. జాగీ జాన్ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితురాలు ఆమె మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.జాగీ జాన్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు చెప్పారు.టీవీ సెలబ్రిటీ చెఫ్ అయిన జాగీజాన్ అనుమానాస్పద స్థితిలో మరణించిందని, మంగళవారం ఆమె మృతదేహానికి పంచనామా, పోస్టుమార్టం చేపిస్తామని తిరువనంతపురం పోలీసులు చెప్పారు.పోస్టుమార్టం తర్వాతే జాగీజాన్ మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com