ప్రవాసి మిత్ర గొల్లపల్లి మండల కార్యవర్గం నియామకం
- December 24, 2019
తెలంగాణ:ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ గొల్లపల్లి మండల కన్వీనర్ గా మ్యాడవరపు నాగభూషణం, మండల వలంటీర్ గా సయిండ్ల దామోదర్ ను నియమిస్తూ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల మంగళవారం జగిత్యాలలో నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి పాల్గొన్నారు.
వలస కార్మికుల హక్కులు, సంక్షేమం పట్ల వీరికి ఉన్న నిబద్దత, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ లో క్రియాశీలకంగా పని చేయాలనే ఆసక్తి, నాయకత్వ లక్షణాలను గుర్తించి ఈ నియామకాలు చేపట్టినట్లు స్వదేశ్ తెలిపారు.
ప్రజలు బ్రతుకుదెరువు కోసం, ఉద్యోగం, ఉపాధి కోసం అంతర్గత వలసలు, అంతర్జాతీయ వలసలు వెళుతుంటారు. సురక్షితమైన, చట్టబద్దమైన వలసల కోసం ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నిర్వహించే అవగాహన, చైతన్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఈ సందర్బంగా స్వదేశ్ అన్నారు
తాజా వార్తలు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!







