హీరా గోల్డ్ నౌహీరా షేక్ కేసులన్నీ SFIO కు బదిలీ
- December 25, 2019హైదరాబాద్: సుమారు 1.72 లక్షల మంది పెట్టుబడి దారులను మోసం చేసి సుమారు రూ. 5600 కోట్లను కాజేసిన ఆరోపణపై 2018 అక్టోబర్ 16వ తేదీన తెలంగాణ పోలీసులు
హీరా గోల్డ్ చీఫ్ నౌహీరా షేక్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నౌహీరా షేక్కు తెలంగాణ హైకోర్టు లో చుక్కెదురైంది. నౌహీరా షేక్పై ఉన్న కేసులను సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకొంది. తెలంగాణ రాష్ట్రంలో నౌహీరా షేక్పై 10 కేసులు ఉన్నాయి. బుధవారం నాడు హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ సాయంత్రం నౌహీరా షేక్ చంచల్గూడ జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. కోర్టులో రూ. 5 కోట్లను డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని కూడ హైకోర్టు నౌహీరా షేక్ను ఆదేశించింది. కోర్టులో ఆమె పాస్పోర్టును సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు