కజకిస్తాన్లో విమాన ప్రమాదం...
- December 27, 2019100 మందితో ప్రయాణిస్తున్న ఓ విమానం కజకిస్తాన్లో కూలిపోయిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.అల్మాటీ ఎయిర్పోర్ట్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం టేక్ ఆఫ్ అయిన బెక్ ఎయిర్ క్రాఫ్ట్ కాసేపటికే కూలిపోయింది.
అత్యవసర సహాయ సిబ్బంది ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. ఇప్పటి వరకూ ఏడుగురు మరణించినట్లు ధృవీకరించారు. గాయపడినవారిని, ఇతరులను శిథిలాల నుంచి రక్షిస్తున్నారని అధికారులు తెలిపారు.ఈ విమానం కజకిస్తాన్లోని అతి పెద్ద నగరం అల్మాటీ నుంచి దేశ రాజధాని నూర్-సుల్తాన్ నగరానికి వెళ్తోంది.
ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 95 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారని అల్మాటీ ఎయిర్ పోర్ట్ తెలిపింది.స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.22 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కిందికి దిగిపోయిన విమానం ఓ కాంక్రీట్ గోడను గుద్దుకుని, ఓ రెండస్థుల భవనాన్ని ఓ వైపు ఢీకొట్టింది. విమానం కూలిన తర్వాత మంటలు చెలరేగలేదు.
సహాయక సిబ్బంది గాయపడినవారిని రక్షిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. వాటిలో... ఆంబులెన్స్ కోసం అరుస్తున్న ఓ మహిళ, ఓ భవనంలోకి దూసుకెళ్లిన విమానం కాక్పిట్ కనిపిస్తున్నాయి.ప్రమాదానికి కారణాలను నిర్థరించడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటైంది.ప్రమాదంపై దేశ అధ్యక్షుడు ఖాసిమ్-జొమార్ట్ తొకయేవ్ విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!