కజకిస్తాన్లో విమాన ప్రమాదం...
- December 27, 2019
100 మందితో ప్రయాణిస్తున్న ఓ విమానం కజకిస్తాన్లో కూలిపోయిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.అల్మాటీ ఎయిర్పోర్ట్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం టేక్ ఆఫ్ అయిన బెక్ ఎయిర్ క్రాఫ్ట్ కాసేపటికే కూలిపోయింది.
అత్యవసర సహాయ సిబ్బంది ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. ఇప్పటి వరకూ ఏడుగురు మరణించినట్లు ధృవీకరించారు. గాయపడినవారిని, ఇతరులను శిథిలాల నుంచి రక్షిస్తున్నారని అధికారులు తెలిపారు.ఈ విమానం కజకిస్తాన్లోని అతి పెద్ద నగరం అల్మాటీ నుంచి దేశ రాజధాని నూర్-సుల్తాన్ నగరానికి వెళ్తోంది.
ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 95 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారని అల్మాటీ ఎయిర్ పోర్ట్ తెలిపింది.స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.22 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కిందికి దిగిపోయిన విమానం ఓ కాంక్రీట్ గోడను గుద్దుకుని, ఓ రెండస్థుల భవనాన్ని ఓ వైపు ఢీకొట్టింది. విమానం కూలిన తర్వాత మంటలు చెలరేగలేదు.
సహాయక సిబ్బంది గాయపడినవారిని రక్షిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. వాటిలో... ఆంబులెన్స్ కోసం అరుస్తున్న ఓ మహిళ, ఓ భవనంలోకి దూసుకెళ్లిన విమానం కాక్పిట్ కనిపిస్తున్నాయి.ప్రమాదానికి కారణాలను నిర్థరించడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటైంది.ప్రమాదంపై దేశ అధ్యక్షుడు ఖాసిమ్-జొమార్ట్ తొకయేవ్ విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







